ETV Bharat / city

'ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కావటం మంత్రులకు ఇష్టంలేదు' - 'ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కావటం మంత్రులకు ఇష్టంలేదు'

శాసనమండలి సమావేశాల్లో వైకాపా మంత్రులు ఇష్టానుసారం వ్యవహరించారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి తమపై దాడి చేశారన్న దీపక్‌రెడ్డి... శాసనమండలి వీడియోలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

'ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కావటం మంత్రులకు ఇష్టంలేదు'
'ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కావటం మంత్రులకు ఇష్టంలేదు'
author img

By

Published : Jun 18, 2020, 3:02 PM IST

శాసనమండలి సమావేశాల్లో మంత్రులు నోటికిచ్చినట్లు మాట్లాడారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు. సభలో ఉన్న 18 మంది మంత్రులు ఇష్టానుసారం వ్వవహరించారని ధ్వజమెత్తారు. ద్రవ్య వినిమయ బిల్లును ముందు పాస్ చేయాలని చెప్పినా... మంత్రులు వినకుండా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు పెట్టాలని చూశారని ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అవ్వడం మంత్రులకు ఇష్టం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి దమ్ముంటే శాసనమండలి వీడియోలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి వెల్లంపల్లి తమపై దాడి చేశారన్న దీపక్‌రెడ్డి..., వీడియోలు బయట పెడితే ఎవరు ఎవరిపై దాడి చేశారో తెలుస్తుందన్నారు.

శాసనమండలి సమావేశాల్లో మంత్రులు నోటికిచ్చినట్లు మాట్లాడారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మండిపడ్డారు. సభలో ఉన్న 18 మంది మంత్రులు ఇష్టానుసారం వ్వవహరించారని ధ్వజమెత్తారు. ద్రవ్య వినిమయ బిల్లును ముందు పాస్ చేయాలని చెప్పినా... మంత్రులు వినకుండా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు పెట్టాలని చూశారని ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లు పాస్ అవ్వడం మంత్రులకు ఇష్టం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి దమ్ముంటే శాసనమండలి వీడియోలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మంత్రి వెల్లంపల్లి తమపై దాడి చేశారన్న దీపక్‌రెడ్డి..., వీడియోలు బయట పెడితే ఎవరు ఎవరిపై దాడి చేశారో తెలుస్తుందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.