ETV Bharat / city

MLA ROJA ON INDIGO STAFF: ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తాం: రోజా

author img

By

Published : Dec 14, 2021, 4:46 PM IST

Updated : Dec 14, 2021, 5:05 PM IST

MLA ROJA ON INDIGO STAFF: సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాజమహేంద్రవరం-తిరుపతి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే రోజా సంస్థ సిబ్బంది తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికులను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA ROJA ON INDIGO
MLA ROJA ON INDIGO
ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం..

MLA ROJA ON INDIGO STAFF: ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడేలా ఇండిగో సంస్థ నిర్ణయం తీసుకోవడం సరికాదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సాంకేతిక లోపం ఉన్నా బెంగళూరుకు మళ్లించి.. డోర్లు తీయకుండా తమను మానసికంగా ఆవేదనకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో బెంగళూరు మళ్లించిన విషయం తెలిసిందే. ఆ విమానంలో రోజాతో పాటు తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.

బెంగళూరులో విమానం ల్యాండైన అనంతరం ఈ ఘటనపై రోజా వీడియోలు విడుదల చేశారు. ఇండిగో సిబ్బంది, సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ''వాతావరణం సరిగాలేకపోవడంతో బెంగళూరులో విమానం ల్యాండ్‌ చేశామని సిబ్బంది చెప్పారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో దిగాక సాంకేతిక సమస్య అని తెలిసింది. విమానంలో ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. ఒక్కొక్కరు రూ. 5,000 కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఇది కరెక్ట్‌ కాదు. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తాం'' అని రోజా అన్నారు.

ఇదీ చదవండి:

Flight Diverted: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. దారి మళ్లింపు..

ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహం..

MLA ROJA ON INDIGO STAFF: ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడేలా ఇండిగో సంస్థ నిర్ణయం తీసుకోవడం సరికాదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. సాంకేతిక లోపం ఉన్నా బెంగళూరుకు మళ్లించి.. డోర్లు తీయకుండా తమను మానసికంగా ఆవేదనకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం నుంచి తిరుపతి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో బెంగళూరు మళ్లించిన విషయం తెలిసిందే. ఆ విమానంలో రోజాతో పాటు తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.

బెంగళూరులో విమానం ల్యాండైన అనంతరం ఈ ఘటనపై రోజా వీడియోలు విడుదల చేశారు. ఇండిగో సిబ్బంది, సంస్థపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ''వాతావరణం సరిగాలేకపోవడంతో బెంగళూరులో విమానం ల్యాండ్‌ చేశామని సిబ్బంది చెప్పారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో దిగాక సాంకేతిక సమస్య అని తెలిసింది. విమానంలో ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. ఒక్కొక్కరు రూ. 5,000 కడితేనే దించుతామని ఇండిగో సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఇది కరెక్ట్‌ కాదు. ఇండిగో సిబ్బంది వ్యవహార శైలిపై కోర్టును ఆశ్రయిస్తాం'' అని రోజా అన్నారు.

ఇదీ చదవండి:

Flight Diverted: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. దారి మళ్లింపు..

Last Updated : Dec 14, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.