తనపై ఒక యువకుడు, అతని స్నేహితులు అత్యాచారం చేశారంటూ ఓ బాలిక విజయవాడ భవానీపురం పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనపై దౌర్జన్యానికి పాల్పడ్డాడంటూ ఆరోపించింది. దీనిపై సీపీ ద్వారకా తిరుమలరావు వివరాలు తెలియజేశారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలు తన తల్లితో నివాసముంటూ పని చేసుకుని జీవిస్తున్నారు. ఈ క్రమంలో తనతో కలిసి పని చేసే ఓ యువకుడితో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకుంటానని చెప్పి గత సెప్టెంబర్ నెలలో తీసుకెళ్లాడని.. యువకుడితో పాటు అతడి మిత్రులూ తనపై అత్యాచారం చేశారని బాధితురాలు తెలిపినట్లు సీపీ వివరించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని.. నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ఇవీ చదవండి..