ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో... విజయవాడ వన్టౌన్ కె.బి.ఎన్ కళాశాల ప్రాంగణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్మేళా పరిశీలనకు వచ్చిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గించేందుకు యువతకు శిక్షణ ఇస్తున్నామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. ఈ జాబ్మేళాకు ఇరవైకి పైగా కంపెనీలు వచ్చాయని వెల్లడించారు. 1900 ఉద్యోగాలకు ఆశావాహులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:'అలా జరగకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా'