SAMINENIO UDAYABHANU: వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ.. సామాజికవేత్త కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
బుధవారం ఈ పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. కేసుల ఉపసంహరణపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదులు సమయం కోరారు. సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Suspension: యువకుడి ఆత్మహత్య కేసు.. సీఐపై సస్పెన్షన్ వేటు !