ETV Bharat / city

గుండెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు - ఆంధ్ర హాస్పిటల్స్​ తాజా వార్తలు

విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్​ నిర్వహించిన 21వ పిల్లల గుండె ఆపరేషన్ల క్యాంపు ముగిసింది. చిన్నారుల గుండె ఆపరేషన్లలో  అతి క్లిష్టమైన కవాట సమస్యలున్న 15 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్​ పి.వి.రామారావు తెలిపారు.

heart-surgeries-in-andhra-hospitals-in-vijayawada
గుండెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్స్​
author img

By

Published : Jan 11, 2020, 9:01 PM IST

గుండెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్స్​

విజయవాడలో ఆంధ్ర ఆసుపత్రి వారు నిర్వహించిన 21వ పిల్లల గుండె సర్జరీ క్యాంపు విజయవంతంగా ముగిసింది. సూపర్​స్టార్​ మహేష్​బాబు, హీలింగ్​ లిటిల్​ హార్ట్స్​ యూకే బృందం సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల గుండె ఆపరేషన్లలో అతి క్లిష్టమైన కవాట సమస్యలున్న 15 మంది చిన్నారులకు శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్​ పి.వి.రామారావు తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తమ విజయానికి వైద్యుల సమష్టి కృషే కారణమన్నారు. ప్రస్తుత రోజుల్లో పుట్టే పిల్లలకు పుట్టుకతోనే గుండె కవాట లోపాలతో పుడుతున్నారని డాక్టర్​ దిలీప్​ చెప్పారు. ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి 20 సంవత్సరాలు వస్తేనే సాధ్యమయ్యేదని... డాక్టర్​ మహ్మద్​ నాసిర్​ ఆధ్వర్యంలో గుండెలోని భాగంతోనే కవాటాలను తయారు చేసి అమర్చే నూతన ప్రక్రియ కనుగొన్నామని తెలిపారు. ప్రతి ఏటా 7 వేల మంది పిల్లలు గుండె జబ్బులతో పుడుతున్నారని... అందులో కేవలం 600 మందికే గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు.

గుండెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన ఆంధ్ర హాస్పిటల్స్​

విజయవాడలో ఆంధ్ర ఆసుపత్రి వారు నిర్వహించిన 21వ పిల్లల గుండె సర్జరీ క్యాంపు విజయవంతంగా ముగిసింది. సూపర్​స్టార్​ మహేష్​బాబు, హీలింగ్​ లిటిల్​ హార్ట్స్​ యూకే బృందం సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిన్నారుల గుండె ఆపరేషన్లలో అతి క్లిష్టమైన కవాట సమస్యలున్న 15 మంది చిన్నారులకు శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్​ పి.వి.రామారావు తెలిపారు. ప్రస్తుతం వీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. తమ విజయానికి వైద్యుల సమష్టి కృషే కారణమన్నారు. ప్రస్తుత రోజుల్లో పుట్టే పిల్లలకు పుట్టుకతోనే గుండె కవాట లోపాలతో పుడుతున్నారని డాక్టర్​ దిలీప్​ చెప్పారు. ఇలాంటి శస్త్రచికిత్సలు చేయడానికి 20 సంవత్సరాలు వస్తేనే సాధ్యమయ్యేదని... డాక్టర్​ మహ్మద్​ నాసిర్​ ఆధ్వర్యంలో గుండెలోని భాగంతోనే కవాటాలను తయారు చేసి అమర్చే నూతన ప్రక్రియ కనుగొన్నామని తెలిపారు. ప్రతి ఏటా 7 వేల మంది పిల్లలు గుండె జబ్బులతో పుడుతున్నారని... అందులో కేవలం 600 మందికే గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు.

ఇదీ చదవండి:

ఆంధ్ర ఆసుపత్రిలో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.