ETV Bharat / city

జూన్​ 21 నుంచి నెల రోజుల పాటు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు - National Medical Association state secretary news

రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజుల పాటు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నేషనల్ మెడికల్​ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేముల భాను ప్రకాశ్​ అన్నారు. దీని ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ అనుమతించిన ఆయుర్వేద మందులను ప్రజలకు అందిస్తామని తెలిపారు.

Free Ayurvedic Medical Camps
ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాల వివరాలు వెల్లడిస్తున్న నేషనల్ మెడికల్​ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి
author img

By

Published : Jun 19, 2021, 9:29 PM IST

రాష్ట్రవ్యాప్తంగా జూన్​ 21 నుంచి జులై 20వరకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నేషనల్ మెడికల్​ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేముల భానుప్రకాశ్​ తెలిపారు. కేంద్ర ఆయుష్​ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్​ మెడికల్​ అసోసియేషన్​ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ శిబిరాల ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ అనుమతించిన ఆయుర్వేద మందులను ప్రజలకు అందిస్తామన్నారు. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, యోగాసనాల గురించి సూచిస్తామని చెప్పారు.

జూన్​ 21న యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని డా. ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్​లో మొదటి వైద్య శిబిరం ప్రారంభిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తామని వేముల భాను ప్రకాశ్​ వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవటంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా జూన్​ 21 నుంచి జులై 20వరకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నేషనల్ మెడికల్​ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేముల భానుప్రకాశ్​ తెలిపారు. కేంద్ర ఆయుష్​ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్​ మెడికల్​ అసోసియేషన్​ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ శిబిరాల ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆయుష్​ మంత్రిత్వ శాఖ అనుమతించిన ఆయుర్వేద మందులను ప్రజలకు అందిస్తామన్నారు. కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, యోగాసనాల గురించి సూచిస్తామని చెప్పారు.

జూన్​ 21న యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని డా. ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్​లో మొదటి వైద్య శిబిరం ప్రారంభిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తామని వేముల భాను ప్రకాశ్​ వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవటంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.