విజయవాడ ఇంద్రకీలాద్రిపై(vijayawada indrakeeladri) నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి(temple) చేరుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత అలంకారంలో ఉన్న దుర్గమ్మను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు(minister vellampalli srinivasarao), ఎంపి మోపీదేవి వెంకటరమణ(MP mopidevi venkataramana), ఎమ్మెల్యే మల్లాది విష్ణు(MLA malladhi vishnu) దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, క్యూలైన్లు, కేశఖండనతో పాటు అన్ని విభాగాలనూ సమన్వయం చేశామని మంత్రి వివరించారు. మూలానక్షత్రం రోజున అమ్మవారికి ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. కరోనా నిబంధనలను(corona restrictions) పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.
![స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13286610_durgamma-1.png)