ETV Bharat / city

కృష్ణాపై కరోనా పడగ... కట్టడికి పోరాడుతున్న యంత్రాంగం

author img

By

Published : Jul 17, 2020, 2:17 PM IST

Updated : Jul 17, 2020, 2:39 PM IST

కృష్ణా జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అని తేడాలేకుండా రోజురోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నా... వ్యాధి నుంచి కోలుకుంటున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం అనుక్షణం పనిచేస్తోందని కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రుల్లో చేరాలని సూచించారు. కరోనా పరీక్షలు, కొవిడ్ ఆసుపత్రుల వివరాల కోసం కాల్ సెంటర్ నెంబరుకు ఫోన్ చేయొచ్చని తెలిపారు.

కృష్ణాపై కరోనా పగడ... కట్టడికి పోరాడుతున్న యంత్రాంగం
కృష్ణాపై కరోనా పగడ... కట్టడికి పోరాడుతున్న యంత్రాంగం

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. వీటితో పాటు కరోనా నుంచి కోలుకున్నవారు అధికంగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నా..ప్రభుత్వ ఉద్యోగులు పలువురు వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ శాతం విజయవాడ నగరానికి చెందినవే ఉండడం గమనార్హం. కృష్ణలంకలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. మురికివాడలు, కాలనీలు అనే తేడా లేకుండా వైరస్‌ విజృంభిస్తోంది. సింగ్‌నగర్‌, వన్‌టౌన్‌, భవానీపురం, పటమట, మొగల్రాజపురం, మాచవరం, గుణదల తదితర ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి.

కరోనా పరీక్షల కోసం కాల్ చేయండి

గ్రామీణంలో.. ప్రసాదంపాడు, గొల్లపూడి, కానూరు, యనమలకుదురు, పోరంకిలో ఎక్కువ మందికి కరోనా వైరస్‌ సోకింది. మచిలీపట్నం డివిజన్‌లో కేసుల సంఖ్య 200 దాటాయి. నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట పట్టణాల్లోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరీక్షలు చేయించేందుకు, కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేశారు. కాల్‌ సెంటర్‌ నంబరు 94910 58200కు ఫోన్‌ చేసి ఆసుపత్రుల్లో చేరవచ్చని జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ సూచించారు. ప్రభుత్వం కరోనాకు ఎంత ఖర్చు చేసినా, ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా.. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రులకు రండి

కార్యాలయాలకు వెళ్లేవారు, వ్యక్తిగత పనులపై బయట తిరిగే వారు తప్పనిసరిగా శానిటైజేషన్‌, మాస్క్‌, సోషల్‌ డిస్టెన్స్‌ అవలంభించాలని కలెక్టర్ సూచించారు. కొద్దిపాటి అనారోగ్యం, అలసట ఉంటే పరీక్షలు చేయించుకుని ఇంటి వద్దనే చికిత్స తీసుకోవచ్చని అన్నారు. ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడాలన్నారు. రుచి, వాసన పసిగట్టలేకపోవడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం, శ్వాసతీసుకోలేకపోవడం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రుల్లో చేరాలన్నారు. లక్షణాలు కనిపించకుండా పాజిటివ్‌గా తేలితే.. ఇంటి వద్ద ఐసోలేషన్‌ అయి వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో అవసరమైన పడకలున్నాయని వివరించారు.

మరో 10 వేల కిట్లు

వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌, ఆర్‌టీసీపీఆర్‌, ట్రూనాట్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాకు అదనంగా మరో 10వేల కిట్లు వచ్చినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, కోలుకున్నవారికి రూ.2వేలు ఇచ్చి పంపుతున్నామని కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు.

ఇదీ చదవండి : ఆపరేషన్ ముస్కాన్: తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

కృష్ణా జిల్లాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది. మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. వీటితో పాటు కరోనా నుంచి కోలుకున్నవారు అధికంగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నా..ప్రభుత్వ ఉద్యోగులు పలువురు వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ శాతం విజయవాడ నగరానికి చెందినవే ఉండడం గమనార్హం. కృష్ణలంకలో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. మురికివాడలు, కాలనీలు అనే తేడా లేకుండా వైరస్‌ విజృంభిస్తోంది. సింగ్‌నగర్‌, వన్‌టౌన్‌, భవానీపురం, పటమట, మొగల్రాజపురం, మాచవరం, గుణదల తదితర ప్రాంతాల్లో అధికంగా నమోదు అవుతున్నాయి.

కరోనా పరీక్షల కోసం కాల్ చేయండి

గ్రామీణంలో.. ప్రసాదంపాడు, గొల్లపూడి, కానూరు, యనమలకుదురు, పోరంకిలో ఎక్కువ మందికి కరోనా వైరస్‌ సోకింది. మచిలీపట్నం డివిజన్‌లో కేసుల సంఖ్య 200 దాటాయి. నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట పట్టణాల్లోనూ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా పరీక్షలు చేయించేందుకు, కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటుచేశారు. కాల్‌ సెంటర్‌ నంబరు 94910 58200కు ఫోన్‌ చేసి ఆసుపత్రుల్లో చేరవచ్చని జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ సూచించారు. ప్రభుత్వం కరోనాకు ఎంత ఖర్చు చేసినా, ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా.. ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు.

లక్షణాలుంటే వెంటనే ఆసుపత్రులకు రండి

కార్యాలయాలకు వెళ్లేవారు, వ్యక్తిగత పనులపై బయట తిరిగే వారు తప్పనిసరిగా శానిటైజేషన్‌, మాస్క్‌, సోషల్‌ డిస్టెన్స్‌ అవలంభించాలని కలెక్టర్ సూచించారు. కొద్దిపాటి అనారోగ్యం, అలసట ఉంటే పరీక్షలు చేయించుకుని ఇంటి వద్దనే చికిత్స తీసుకోవచ్చని అన్నారు. ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడాలన్నారు. రుచి, వాసన పసిగట్టలేకపోవడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం, శ్వాసతీసుకోలేకపోవడం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రుల్లో చేరాలన్నారు. లక్షణాలు కనిపించకుండా పాజిటివ్‌గా తేలితే.. ఇంటి వద్ద ఐసోలేషన్‌ అయి వైద్యుల పర్యవేక్షణలో చికిత్సలు తీసుకోవాలన్నారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో అవసరమైన పడకలున్నాయని వివరించారు.

మరో 10 వేల కిట్లు

వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌, ఆర్‌టీసీపీఆర్‌, ట్రూనాట్‌ పరీక్షల నిర్వహణకు జిల్లాకు అదనంగా మరో 10వేల కిట్లు వచ్చినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, కోలుకున్నవారికి రూ.2వేలు ఇచ్చి పంపుతున్నామని కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు.

ఇదీ చదవండి : ఆపరేషన్ ముస్కాన్: తల్లిదండ్రుల చెంతకు చిన్నారులు

Last Updated : Jul 17, 2020, 2:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.