ETV Bharat / city

పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్

author img

By

Published : Oct 31, 2020, 5:04 PM IST

Updated : Nov 1, 2020, 5:28 AM IST

polavaram
పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే

17:02 October 31

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో జోక్యం చేసుకోవాలని, నిర్మాణం పూర్తి చేసేలా నిధులు ఇప్పించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విన్నవించారు. ఇప్పటికే 2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా కమిటీలు తుది అంచనాలు ఆమోదించాయని, రివైజ్డు కాస్ట్‌ కమిటీ సైతం రూ.47,617.74 కోట్ల అంచనాల సవరణకు ఆమోదించిందని వివరించారు. ఆ మేరకు పెట్టుబడి అనుమతి ఇచ్చేలా కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖలకు సూచించాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు. ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతిని శనివారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ విడుదల చేశారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే ఎక్కడో సమాచారలోపం ఉందని అనిపిస్తోందని లేఖలో ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మాటల్లోనే ఇలా ఉన్నాయి.

  • రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్రమే ప్రాజెక్టును నిర్మిస్తుందని, అవసరమైన అన్ని అనుమతులు వచ్చేలా చూస్తుందని చట్టంలో పేర్కొన్నారు. 2014 ఏప్రిల్‌ 1 వరకు ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పరిగణిస్తామన్నారు. 29.4.2014 నాటి కేబినెట్‌ నోట్‌లోని 5.3 పేరాలో ఈ విషయాన్ని స్పష్టంగా పొందుపరిచారు. పోలవరం వ్యయాన్ని నాడు 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లుగా ప్రస్తావిస్తూనే... తదుపరి కాలానుగుణంగా పెరిగే వ్యయాన్ని, ఆయకట్టు అభివృద్ధికి అయ్యే ఖర్చును, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసంతో సహా ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరిస్తామని ఆ నోట్‌లో పేర్కొన్నారు.
  • 2014 మే 28న గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటుచేశారు. ఈ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ద్వారా లేదా, ఇతర నిపుణులైన ఏజెన్సీల ద్వారా ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. అంటే పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానిది కేవలం నిర్మాణ బాధ్యత మాత్రమేనని స్పష్టమవుతోంది. 2014 పునర్‌ విభజన చట్టంలో పేర్కొన్నట్లు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే.
  • 2005 నుంచి వరుసగా సాంకేతిక సలహా కమిటీలు, తాజాగా సాంకేతిక సలహా కమిటీతోపాటు రివైజ్డు కాస్ట్‌ కమిటీ రూ.28,919.95 కోట్లకు అంచనా వ్యయం పెంచింది. కాలానుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుతున్న విషయం దీంతో తెలుస్తోంది. 2017లో మొదటి సవరణ అంచనా వ్యయానికి పెట్టుబడి    అనుమతిని కేంద్ర ఆర్థికశాఖ షరతులతో ఇచ్చింది. 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని, తాజా ధరల ప్రకారం అయ్యే వ్యయాన్ని రాష్ట్రమే తన వనరుల నుంచి సమకూర్చుకోవాలని 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈ అసంబద్ధ నిర్ణయం 2014 రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధం. పైగా ఇది రాష్ట్రానికి మోయలేని అదనపు భారమవుతుంది. ఇప్పటికే రాష్ట్రం తన వాటా వ్యయాన్ని ఖర్చు చేసింది. దాన్ని రాష్ట్రవాటా ధనంగా 2016 మే 26 నాటి కేంద్ర కేబినెట్‌ తీర్మానంలోనూ అంగీకరించారు.

అన్నీ పరిశీలించాకే కమిటీ ఆమోదం
 

2010-11 ధరలతో మొదటి అంచనాల సవరణకు పెట్టుబడి అనుమతి ఇచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వాస్తవంగా ఎంత ఖర్చవుతుందో అంచనాలు సవరించి తెలియజేయాలని పోలవరం అథారిటీ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 2018 జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం రూ.57,297.42 కోట్లతో సవరించిన అంచనాలు పోలవరం అథారిటీకి సమర్పించింది. కాలానుగుణంగా పెరిగిన ధరలు, డిజైన్లలో మార్పులు 2013 భూసేకరణ చట్టం కారణంగా వ్యయం పెరిగింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకునే వారు సైతం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారానికి అర్హులు కావడంతో అంచనా వ్యయం పెరిగింది. వీటిని పరిశీలించిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ 2017-18 ధరలతో రూ.55,548.87 కోట్లకు పోలవరం అంచనా వ్యయ సవరణలను ఆమోదించింది. ఆ తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ సైతం రూ.47,617.74 కోట్లకు పోలవరం అంచనాలను ఆమోదించింది. ఈ రెండో సవరణ అంచనాలకు కేంద్ర జలశక్తిశాఖ పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంది.

వాస్తవ విరుద్ధంగా అంచనాలు..
 

  • 2016 సెప్టెంబరు వరకు పోలవరానికి నిధులను కేంద్ర ప్రభుత్వం సాయం రూపంలో ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం అథారిటీ నాబార్డు ద్వారా నిధులు తిరిగి చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పోలవరంపై రూ.12,520.91 కోట్లను ఖర్చు చేసింది. అందులోని రూ.8,507.26 కోట్లను కేంద్రం ఇప్పటికే తిరిగి చెల్లించింది. ఇంకా రూ.4,013.65 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో రూ.2,234.77 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతిస్తూనే... 2013-14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని పోలవరం అథారిటీ ఆమోదించి పంపాలని షరతు విధించింది. అంతేకాకుండా కేంద్ర జలసంఘం నిబంధనలకు విరుద్ధంగా అందులో నుంచి తాగునీటి సరఫరా వ్యయాన్ని మినహాయించాలని కూడా పేర్కొంది. కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇవ్వాల్సిన వాస్తవ వ్యయంతో పోలిస్తే ఇది ఎంత మాత్రం సరిపోయేలా లేదు. ఇప్పటికే పోలవరంపై రూ.17,656.82 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవ విరుద్ధంగా నిర్ణయించే పోలవరం అంచనాల సవరణతో నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయినా నిర్వాసితులను తరలించకుండా జలాశయంలో నీళ్లు నిల్వ చేయడమూ సాధ్యం కాదు.
  • నిర్వాసితులకు పునరావాసం విషయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్‌, అవార్డు ప్రకటించిన నాటి ధరలను పరిగణనలోకి తీసుకుని పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక సంవత్సరం ధరలకు అనుగుణంగా చెల్లించడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల తరలింపు ఆలస్యమయితే ఎప్పటికప్పుడు భూసేకరణ, పునరావాస వ్యయం పెరుగుతూనే ఉంటుంది.
  • పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఆలస్యం జరిగినా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మరింత పెంచుకోవడమే అవుతుంది. ఒక జాతీయ ప్రాజెక్టు విషయంలో జాతి ప్రయోజనాల రీత్యా ఇది తగదని గుర్తించాలి.

ఇదీ చదవండి :   కరోనా సెకండ్ వేవ్​ మెుదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా ?


 

17:02 October 31

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

పోలవరం ప్రాజెక్టు తుది అంచనాల విషయంలో జోక్యం చేసుకోవాలని, నిర్మాణం పూర్తి చేసేలా నిధులు ఇప్పించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విన్నవించారు. ఇప్పటికే 2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహా కమిటీలు తుది అంచనాలు ఆమోదించాయని, రివైజ్డు కాస్ట్‌ కమిటీ సైతం రూ.47,617.74 కోట్ల అంచనాల సవరణకు ఆమోదించిందని వివరించారు. ఆ మేరకు పెట్టుబడి అనుమతి ఇచ్చేలా కేంద్ర ఆర్థిక, జలశక్తి శాఖలకు సూచించాలని ఆ లేఖలో ప్రధానిని కోరారు. ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రతిని శనివారం జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ విడుదల చేశారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలన్నీ గమనిస్తుంటే ఎక్కడో సమాచారలోపం ఉందని అనిపిస్తోందని లేఖలో ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి మాటల్లోనే ఇలా ఉన్నాయి.

  • రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కేంద్రమే ప్రాజెక్టును నిర్మిస్తుందని, అవసరమైన అన్ని అనుమతులు వచ్చేలా చూస్తుందని చట్టంలో పేర్కొన్నారు. 2014 ఏప్రిల్‌ 1 వరకు ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,135.87 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పరిగణిస్తామన్నారు. 29.4.2014 నాటి కేబినెట్‌ నోట్‌లోని 5.3 పేరాలో ఈ విషయాన్ని స్పష్టంగా పొందుపరిచారు. పోలవరం వ్యయాన్ని నాడు 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లుగా ప్రస్తావిస్తూనే... తదుపరి కాలానుగుణంగా పెరిగే వ్యయాన్ని, ఆయకట్టు అభివృద్ధికి అయ్యే ఖర్చును, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసంతో సహా ప్రాజెక్టుకయ్యే మొత్తం వ్యయాన్ని భరిస్తామని ఆ నోట్‌లో పేర్కొన్నారు.
  • 2014 మే 28న గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటుచేశారు. ఈ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల ద్వారా లేదా, ఇతర నిపుణులైన ఏజెన్సీల ద్వారా ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. అంటే పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానిది కేవలం నిర్మాణ బాధ్యత మాత్రమేనని స్పష్టమవుతోంది. 2014 పునర్‌ విభజన చట్టంలో పేర్కొన్నట్లు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే.
  • 2005 నుంచి వరుసగా సాంకేతిక సలహా కమిటీలు, తాజాగా సాంకేతిక సలహా కమిటీతోపాటు రివైజ్డు కాస్ట్‌ కమిటీ రూ.28,919.95 కోట్లకు అంచనా వ్యయం పెంచింది. కాలానుగుణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెరుగుతున్న విషయం దీంతో తెలుస్తోంది. 2017లో మొదటి సవరణ అంచనా వ్యయానికి పెట్టుబడి    అనుమతిని కేంద్ర ఆర్థికశాఖ షరతులతో ఇచ్చింది. 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి పోలవరం ప్రాజెక్టుకు అయ్యే మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని, తాజా ధరల ప్రకారం అయ్యే వ్యయాన్ని రాష్ట్రమే తన వనరుల నుంచి సమకూర్చుకోవాలని 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. ఈ అసంబద్ధ నిర్ణయం 2014 రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధం. పైగా ఇది రాష్ట్రానికి మోయలేని అదనపు భారమవుతుంది. ఇప్పటికే రాష్ట్రం తన వాటా వ్యయాన్ని ఖర్చు చేసింది. దాన్ని రాష్ట్రవాటా ధనంగా 2016 మే 26 నాటి కేంద్ర కేబినెట్‌ తీర్మానంలోనూ అంగీకరించారు.

అన్నీ పరిశీలించాకే కమిటీ ఆమోదం
 

2010-11 ధరలతో మొదటి అంచనాల సవరణకు పెట్టుబడి అనుమతి ఇచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వాస్తవంగా ఎంత ఖర్చవుతుందో అంచనాలు సవరించి తెలియజేయాలని పోలవరం అథారిటీ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. 2018 జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం రూ.57,297.42 కోట్లతో సవరించిన అంచనాలు పోలవరం అథారిటీకి సమర్పించింది. కాలానుగుణంగా పెరిగిన ధరలు, డిజైన్లలో మార్పులు 2013 భూసేకరణ చట్టం కారణంగా వ్యయం పెరిగింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకునే వారు సైతం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారానికి అర్హులు కావడంతో అంచనా వ్యయం పెరిగింది. వీటిని పరిశీలించిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ 2017-18 ధరలతో రూ.55,548.87 కోట్లకు పోలవరం అంచనా వ్యయ సవరణలను ఆమోదించింది. ఆ తర్వాత రివైజ్డు కాస్ట్‌ కమిటీ సైతం రూ.47,617.74 కోట్లకు పోలవరం అంచనాలను ఆమోదించింది. ఈ రెండో సవరణ అంచనాలకు కేంద్ర జలశక్తిశాఖ పెట్టుబడి అనుమతులు ఇవ్వాల్సి ఉంది.

వాస్తవ విరుద్ధంగా అంచనాలు..
 

  • 2016 సెప్టెంబరు వరకు పోలవరానికి నిధులను కేంద్ర ప్రభుత్వం సాయం రూపంలో ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా పోలవరం అథారిటీ నాబార్డు ద్వారా నిధులు తిరిగి చెల్లిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పోలవరంపై రూ.12,520.91 కోట్లను ఖర్చు చేసింది. అందులోని రూ.8,507.26 కోట్లను కేంద్రం ఇప్పటికే తిరిగి చెల్లించింది. ఇంకా రూ.4,013.65 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో రూ.2,234.77 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ అనుమతిస్తూనే... 2013-14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని పోలవరం అథారిటీ ఆమోదించి పంపాలని షరతు విధించింది. అంతేకాకుండా కేంద్ర జలసంఘం నిబంధనలకు విరుద్ధంగా అందులో నుంచి తాగునీటి సరఫరా వ్యయాన్ని మినహాయించాలని కూడా పేర్కొంది. కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇవ్వాల్సిన వాస్తవ వ్యయంతో పోలిస్తే ఇది ఎంత మాత్రం సరిపోయేలా లేదు. ఇప్పటికే పోలవరంపై రూ.17,656.82 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవ విరుద్ధంగా నిర్ణయించే పోలవరం అంచనాల సవరణతో నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయినా నిర్వాసితులను తరలించకుండా జలాశయంలో నీళ్లు నిల్వ చేయడమూ సాధ్యం కాదు.
  • నిర్వాసితులకు పునరావాసం విషయంలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముసాయిదా నోటిఫికేషన్‌, అవార్డు ప్రకటించిన నాటి ధరలను పరిగణనలోకి తీసుకుని పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో ఒక సంవత్సరం ధరలకు అనుగుణంగా చెల్లించడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల తరలింపు ఆలస్యమయితే ఎప్పటికప్పుడు భూసేకరణ, పునరావాస వ్యయం పెరుగుతూనే ఉంటుంది.
  • పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇవ్వడంలో ఎలాంటి ఆలస్యం జరిగినా ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మరింత పెంచుకోవడమే అవుతుంది. ఒక జాతీయ ప్రాజెక్టు విషయంలో జాతి ప్రయోజనాల రీత్యా ఇది తగదని గుర్తించాలి.

ఇదీ చదవండి :   కరోనా సెకండ్ వేవ్​ మెుదటిసారి కంటే తీవ్రస్థాయిలో ఉండనుందా ?


 

Last Updated : Nov 1, 2020, 5:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.