రాష్ట్రంలో హోం ఐసోలేషన్లో ఉంటున్న కొవిడ్ రోగుల పర్యవేక్షణ, కిట్ల పంపిణీ, టెలికన్సల్టేషన్ తదితర అంశాల కోసం ప్రత్యేకాధికారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుబంధంగా వివిధ అంశాల పర్యవేక్షణ కోసం ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకేశ్కు ఈ బాధ్యతల్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల క్షేత్రస్థాయి పర్యటనలు చేసి హోంఐసోలేషన్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిందిగా శ్రీకేశ్ను ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీచదవండి