ETV Bharat / city

వైఎస్సార్ ఆశయాలకు విరుద్ధంగా సీఎం జగన్ నడుస్తున్నారు: శైలజానాథ్

author img

By

Published : Sep 2, 2020, 7:41 PM IST

దివంగత నేత వైఎస్సార్ ఆలోచనలకు విరుద్ధంగా జగన్ పార్టీ ప్రవర్తిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. వైఎస్సార్ 11వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

apcc president
apcc president

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన ఆశయంగా వైఎస్సార్ పని చేసారని..ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించారు. వైెఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి పార్టీ, వైెస్సార్ ఎప్పుడూ చూడని కండువాను ఆయనకు కట్టడం బాధాకరమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆలోచనలకు విరుద్ధంగా జగన్ పార్టీ ప్రవర్తిస్తుందని చెప్పారు. అధికారం కోసం వైఎస్సార్ పేరు వాడుతున్నారు తప్ప.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం లేదన్నారు. వైెఎస్సార్ వ్యతిరేకులతో కలిసి జగన్ పని చేస్తున్నారని.. అది ఆయన భావజాలానికి వ్యతిరేకమన్నారు.

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన ఆశయంగా వైఎస్సార్ పని చేసారని..ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో నిర్వహించారు. వైెఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వైఎస్సార్ ఆశయాలను అమలు చేస్తామని చెప్పిన జగన్ రెడ్డి పార్టీ, వైెస్సార్ ఎప్పుడూ చూడని కండువాను ఆయనకు కట్టడం బాధాకరమని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆలోచనలకు విరుద్ధంగా జగన్ పార్టీ ప్రవర్తిస్తుందని చెప్పారు. అధికారం కోసం వైఎస్సార్ పేరు వాడుతున్నారు తప్ప.. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం లేదన్నారు. వైెఎస్సార్ వ్యతిరేకులతో కలిసి జగన్ పని చేస్తున్నారని.. అది ఆయన భావజాలానికి వ్యతిరేకమన్నారు.

ఇదీ చదవండి: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.