గంటల అఖండ కచ్ఛపీ మహోత్సవంతో.. విజయవాడలో జరిగిన వీణా యజ్ఞం సంగీతాభిమానులను అలరించింది. సంగీత కళాశాల ప్రాంగణం వేదికగా శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది వైణికులు తమ వీణా నైపుణ్య చాతుర్యం ప్రదర్శించారు.
సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సంగీత యజ్ఞం... లయబద్ధంగా సాగింది. ఒక్కొక్కరూ 20 నిమిషాల చొప్పున వీణానాదంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. సుప్రసిద్ధత విద్వాంసులు తంత్రులను శృతి మధురంగా మీటుతూ శారదా దేవికి సంగీతార్చన చేశారు.
అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తెలుగు వైణిక విద్వాంసుల్ని స్మరించుకుంటూ.. ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇంతమంది ఒకచోటకు చేరి సరస్వతీ దేవికి వీణార్చన జరిపిన కార్యక్రమం దేశంలోమరెక్కడా జరగలేదని కళాకారులు చెప్పారు.