ETV Bharat / city

గోవుల ఆకలి కేకలు.. తీర్చిన తితిదే, స్వచ్ఛంద సంస్థలు

author img

By

Published : Apr 19, 2020, 8:34 PM IST

Updated : Apr 19, 2020, 10:20 PM IST

వెంకన్న స్వామి దయవల్ల మూగజీవాలకు ఆకలి సమస్య ఉండేది కాదు. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాటి ఆలనా పాలనా చూసుకునేవారు కరువయ్యారు. దేవుడి దర్శనానికి భక్తులే రావడం లేదు. ఈ కారణంగా... ఆయన నీడలో బతికే జీవాల పరిస్థితి దయనీయంగా మారింది. అందుకే వాటి ఆలనాపాలనా చూసుకోవటానికి తితిదే, తిరుపతి నగర పాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి.

ttd-and-charities-combindely-providing-food-for-thirumala-temple-cows
ttd-and-charities-combindely-providing-food-for-thirumala-temple-cows
గోవుల ఆకలి కేకలు.. తీర్చిన తితిదే, స్వచ్ఛంద సంస్థలు

లాక్​డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న మూగజీవాలను ఆదుకునే విధంగా తిరుపతిలో నగరపాలక సంస్థ అధికారులు.. స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో రహదారులపై ఆకలితో అలమటిస్తున్న గోవులను ఒకే చోటుకి చేర్చిన నగరపాలక సంస్థ అధికారులు.. తితిదేతో కలిసి వాటి ఆకలి తీర్చే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నగరంలోని బాలాజీ లింక్ బస్టాండ్ ఆవరణలో మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఆవాసం కల్పించారు. వాటికి ఆహారం అందిస్తున్నారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వెటర్నరీ అధికారులు వాటి సంక్షేమాన్ని చూస్తుండగా.. తితిదే గోశాల నుంచి నిత్యం ఒక టన్ను పశుగ్రాసం, 350 కిలోల దాణాను అందిస్తున్నారు. తిరుపతి సిటీ ఛాంబర్ సభ్యులు ఆవుల కోసం.. దాణా, కూరగాయలు, పుచ్చకాయలు ఆహారంగా పెడుతున్నారు. సుమారు 53 గోవుల ఆలనాపాలనా చూస్తున్నారు. లాక్​డౌన్ ముగిసే వరకూ వాటి ఆకలిని తీర్చేలా కృషి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు చెప్పారు.

ఇదీ చదవండి:

మిర్చికి కరోనా కాటు.. పంటను ట్రాక్టర్లతో దున్నించిన రైతు

గోవుల ఆకలి కేకలు.. తీర్చిన తితిదే, స్వచ్ఛంద సంస్థలు

లాక్​డౌన్ కారణంగా ఆహారం అందక ఇబ్బంది పడుతున్న మూగజీవాలను ఆదుకునే విధంగా తిరుపతిలో నగరపాలక సంస్థ అధికారులు.. స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. రాష్ట్ర ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో రహదారులపై ఆకలితో అలమటిస్తున్న గోవులను ఒకే చోటుకి చేర్చిన నగరపాలక సంస్థ అధికారులు.. తితిదేతో కలిసి వాటి ఆకలి తీర్చే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నగరంలోని బాలాజీ లింక్ బస్టాండ్ ఆవరణలో మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఆవాసం కల్పించారు. వాటికి ఆహారం అందిస్తున్నారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వెటర్నరీ అధికారులు వాటి సంక్షేమాన్ని చూస్తుండగా.. తితిదే గోశాల నుంచి నిత్యం ఒక టన్ను పశుగ్రాసం, 350 కిలోల దాణాను అందిస్తున్నారు. తిరుపతి సిటీ ఛాంబర్ సభ్యులు ఆవుల కోసం.. దాణా, కూరగాయలు, పుచ్చకాయలు ఆహారంగా పెడుతున్నారు. సుమారు 53 గోవుల ఆలనాపాలనా చూస్తున్నారు. లాక్​డౌన్ ముగిసే వరకూ వాటి ఆకలిని తీర్చేలా కృషి చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు చెప్పారు.

ఇదీ చదవండి:

మిర్చికి కరోనా కాటు.. పంటను ట్రాక్టర్లతో దున్నించిన రైతు

Last Updated : Apr 19, 2020, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.