ETV Bharat / city

అభ్యర్థులు వేరైనా... భాజపా, వైకాపా రెండూ ఒకటే: శైలజానాథ్

author img

By

Published : Mar 30, 2021, 3:25 PM IST

అభ్యర్థులు వేరైనా.. భాజపా, వైకాపా రెండూ ఒకటేనని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకోలేని ఆ పార్టీలు.. ఏ మోహం పెట్టుకొని తిరుపతి ఉపఎన్నికల్లో ప్రచారం చేస్తాయని ప్రశ్నించారు.

pcc sailajanath on tirupati by election
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

వైకాపా, తెదేపా, భాజపా, జనసేన.. ఏ మొహం పెట్టుకుని తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌... ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు.

అభ్యర్థులు వేరైనా....భాజపా, వైకాపా రెండు ఒకటేనని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు సాధించడం సంగతి ఎలా ఉన్నా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకొంటే చాలని హితవు పలికారు. తిరుపతి నుంచి వైకాపా అభ్యర్థి గెలుపొందితే భాజపాకు సాయపడటం తప్ప మరేమీ చేయలేరన్నారు.

వైకాపా, తెదేపా, భాజపా, జనసేన.. ఏ మొహం పెట్టుకుని తిరుపతి ఉపఎన్నికలో ప్రచారం చేస్తాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్‌... ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు.

అభ్యర్థులు వేరైనా....భాజపా, వైకాపా రెండు ఒకటేనని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు సాధించడం సంగతి ఎలా ఉన్నా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకొంటే చాలని హితవు పలికారు. తిరుపతి నుంచి వైకాపా అభ్యర్థి గెలుపొందితే భాజపాకు సాయపడటం తప్ప మరేమీ చేయలేరన్నారు.

ఇదీ చూడండి:

సీఎం జగన్‌ ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేరు: చింతామోహన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.