ETV Bharat / city

అధికారులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారు: అమర్​నాథ్​ రెడ్డి

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో 15వ డివిజన్​ తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి జ్యోత్స్న తరపున.. మాజీ మంత్రి అమర్​నాథ్​ రెడ్డి ప్రచారం చేశారు. ప్రభుత్వ అధికారులు వైకాపాకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అరాచకాలు ఆగాలంటే.. తెదేపాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Mar 7, 2021, 3:59 PM IST

ex minister amarnath reddy campaigning in tirupati
తిరుపతిలో తెదేపా అభ్యర్థికి మద్దతుగా మాజీ మంత్రి అమర్​నాథ్​ రెడ్డి ప్రచారం

ఎన్నికల వేళ అధికారులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారని మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి 15వ డివిజన్​లో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి జ్యోత్స్నతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాకు ఓటెయ్యాలని కోరారు.

నామినేషన్ల దాఖలు, పరిశీలన దశల్లో అధికారులందరూ వైకాపాకు మద్దతుగా నిలిచారని అమర్​నాథ్​ రెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థులను చెన్నై, బెంగళూరు తీసుకువెళ్లి దాచుకోవాల్సిన భయానక వాతావరణం చిత్తూరు జిల్లాలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల వేళ అధికారులు వైకాపా కార్యకర్తల్లా పని చేస్తున్నారని మాజీ మంత్రి అమర్​నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి 15వ డివిజన్​లో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థి జ్యోత్స్నతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపాకు ఓటెయ్యాలని కోరారు.

నామినేషన్ల దాఖలు, పరిశీలన దశల్లో అధికారులందరూ వైకాపాకు మద్దతుగా నిలిచారని అమర్​నాథ్​ రెడ్డి ఆరోపించారు. తమ అభ్యర్థులను చెన్నై, బెంగళూరు తీసుకువెళ్లి దాచుకోవాల్సిన భయానక వాతావరణం చిత్తూరు జిల్లాలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

మహిళా దినోత్సవం సందర్భంగా.. తిరుపతిలో 2కే రన్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.