ETV Bharat / city

తిరుమలలో ఫైర్ యాక్సిడెంట్.. ప్రమాదమేనా?... ఆత్మహత్యా?

author img

By

Published : May 5, 2021, 9:21 PM IST

తిరుమలలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వ్యక్తి మల్లిరెడ్డి.. ప్రమాదవశాత్తూ కన్నుమూశాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ చేపట్టారు.

Tirumala  fire accident
Tirumala fire accident

తిరుమలలోని దుకాణాల వద్ద బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతిచెందిన వ్యక్తిని మల్లిరెడ్డిగా గుర్తించిన పోలీసులు.. అతడు ప్రమాదం వల్ల మరణించాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు ముందు మల్లిరెడ్డి మొబైల్‌ను తన తమ్ముడికి ఇచ్చినట్లు.. అందులో సెల్ఫీ వీడియో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుని భార్యతో పాటు పలువురిని విచారిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించినా.. మల్లిరెడ్డి మృతిపై పోలీసులకు వచ్చిన అనుమానంతో లోతుగా దర్యాప్తును చేపట్టారు.

తిరుమలలోని దుకాణాల వద్ద బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతిచెందిన వ్యక్తిని మల్లిరెడ్డిగా గుర్తించిన పోలీసులు.. అతడు ప్రమాదం వల్ల మరణించాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు ముందు మల్లిరెడ్డి మొబైల్‌ను తన తమ్ముడికి ఇచ్చినట్లు.. అందులో సెల్ఫీ వీడియో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుని భార్యతో పాటు పలువురిని విచారిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని భావించినా.. మల్లిరెడ్డి మృతిపై పోలీసులకు వచ్చిన అనుమానంతో లోతుగా దర్యాప్తును చేపట్టారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 22,204 కరోనా కేసులు, 85 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.