ETV Bharat / city

తిరుపతిలోని తితిదే భూముల రక్షణకు చర్యలు - Tirupati latest news

తిరుపతిలో ఉన్న తితిదే భూములు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. జేఈఓ సదాభార్గవి ఆదేశాలతో సంబంధిత భూముల చుట్టూ కంచె, సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు.

TTD
TTD
author img

By

Published : Jan 23, 2021, 10:56 PM IST

తిరుపతిలో ఉన్న తితిదే భూములు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల తిరుపతిలోని ఆస్తులను తనిఖీ చేసిన జేఈఓ సదాభార్గవి భవనాలు, ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించారు. ఇవి ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ ఏర్పాట్లు చేపట్టాలంటూ తితిదే ఇంజనీరింగ్, ఎస్టేట్ విభాగాల సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ బృందంలోని అధికారులు... ఆస్తులకు కంచెను ఏర్పాటు చేశారు. తితిదే చెందినవిగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భైరాగిపట్టెడ, కేశవాయనగుంటలో 8 ఆస్తులు, వైకుంఠపురం, ఎంఆర్​పల్లిలో 14 ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి

తిరుపతిలో ఉన్న తితిదే భూములు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇటీవల తిరుపతిలోని ఆస్తులను తనిఖీ చేసిన జేఈఓ సదాభార్గవి భవనాలు, ఖాళీగా ఉన్న స్థలాల వద్ద ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడాన్ని గుర్తించారు. ఇవి ఆక్రమణకు గురికాకుండా వెంటనే రక్షణ ఏర్పాట్లు చేపట్టాలంటూ తితిదే ఇంజనీరింగ్, ఎస్టేట్ విభాగాల సిబ్బందితో టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆ బృందంలోని అధికారులు... ఆస్తులకు కంచెను ఏర్పాటు చేశారు. తితిదే చెందినవిగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. భైరాగిపట్టెడ, కేశవాయనగుంటలో 8 ఆస్తులు, వైకుంఠపురం, ఎంఆర్​పల్లిలో 14 ఆస్తులకు రక్షణ ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి

రామతీర్థానికి రాములోరు.. కొత్త విగ్రహాల తయారీ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.