రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని షరతులతో కూడిన బెయిలుపై విడుదల చేశారు. రెండు నెలల కిందట రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మెుదట ఆయనను కాకినాడ సబ్ జైలుకు తీసుకెళ్లగా... అక్కడి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
కక్ష సాధింపులో భాగంగానే కేసు: నల్లమిల్లి
కేవలం కక్ష సాధింపులో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించారని తెలుగు దేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు చెప్పినప్పటికీ...వైద్యం అందించకుండా చిత్రహింసలకు గురిచేశారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి:
'తెదేపా అండగా ఉంటుంది.. ప్రాణత్యాగాలు చేసుకునే నిర్ణయాలు వద్దు'