ETV Bharat / city

suspend : అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు...మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

నెల్లూరు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో ఇద్దరు ఉద్యోగులు సస్పెన్షన్​కు గురయ్యారు. గూడూరు ఆర్టీవో మల్లికార్జునరెడ్డి, కృష్ణా జిల్లా డీటీసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విఠల్ లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

author img

By

Published : Jan 7, 2022, 12:21 AM IST

అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు
అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు

నెల్లూరు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్​ల అక్రమ రిజిస్ట్రేషన్​ల వ్యవహారంలో మరో ఇద్దరు రవాణాశాఖ ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీఓ సి.మల్లికార్జున రెడ్డి, కృష్ణా జిల్లా డీటీసీ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఎన్. విఠల్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం... వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్​ల వ్యవహారంలో సూళ్లూరుపేట మోటారు వెహికల్ ఇన్​స్పెక్టర్ గోపినాయక్​పై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ పూర్తి కావడంతో పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా నెల్లూరు డీటీసీని రవాణాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ కుంభకోణంలో శాఖా పరమైన విచారణతో పాటు పోలీసు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాలో ఆయిల్ ట్యాంకర్​ల అక్రమ రిజిస్ట్రేషన్​ల వ్యవహారంలో మరో ఇద్దరు రవాణాశాఖ ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీఓ సి.మల్లికార్జున రెడ్డి, కృష్ణా జిల్లా డీటీసీ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఎన్. విఠల్ లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రాథమిక విచారణ అనంతరం... వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్​ల వ్యవహారంలో సూళ్లూరుపేట మోటారు వెహికల్ ఇన్​స్పెక్టర్ గోపినాయక్​పై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ పూర్తి కావడంతో పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సిందిగా నెల్లూరు డీటీసీని రవాణాశాఖ కమిషనర్ ఆదేశించారు. ఈ కుంభకోణంలో శాఖా పరమైన విచారణతో పాటు పోలీసు దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.