'రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో పోరాటం చేస్తా... నిధులు తెస్తా' - Panabaka Lakshmi with Etv bharat
21 రోజుల్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేస్తానని... తిరుపతి ఉపఎన్నికలో తెదేపా అభ్యర్థిని పనబాక లక్ష్మి చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుస్తానుని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజవర్గాల్లోని ఓటర్లతో పరిచయాలు ఉన్నాయన్న పనబాక... చిత్తూరు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని ప్రజలను ఎక్కువగా కలవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. మహిళా సమస్యలపై పార్లమెంట్లో పోరాటం చేస్తానని 'ఈటీవీభారత్కు' ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో వెల్లడించారు.