ETV Bharat / city

తీరిన కష్టాలు.. స్వస్థలాలకు వలస కూలీలు

author img

By

Published : Apr 29, 2020, 1:24 PM IST

లాక్​డౌన్​తో చిక్కుకున్న వలసకూలీలను తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యేక బస్సుల్లో కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం వీరిని స్వస్థలాలకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కూలీలను తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేశారు.

తీరిన కష్టాలు.. స్వస్థలాలకు వలస కూలీలు
తీరిన కష్టాలు.. స్వస్థలాలకు వలస కూలీలు

ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చిక్కుకున్న వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. లాక్​డౌన్​తో వీరు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో వలస కూలీలను తరలించేందుకు అధికారులు 20 బస్సులు ఏర్పాటు చేశారు.

కరోనా నేపథ్యంలో వ్యక్తిగత దూరం పాటించేలా ఒక్కో బస్సుకు 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ముందుగా కూలీలకు కరోనా పరీక్షలు చేసిన అనంతరం వారిని తరలించే ఏర్పాట్లు చేశారు.

ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చిక్కుకున్న వలస కూలీలు సొంతూళ్లకు పయనమయ్యారు. లాక్​డౌన్​తో వీరు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో వలస కూలీలను తరలించేందుకు అధికారులు 20 బస్సులు ఏర్పాటు చేశారు.

కరోనా నేపథ్యంలో వ్యక్తిగత దూరం పాటించేలా ఒక్కో బస్సుకు 30 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. ముందుగా కూలీలకు కరోనా పరీక్షలు చేసిన అనంతరం వారిని తరలించే ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:

కొవిడ్‌ చికిత్సలో వైద్యులకు తోడ్పాటుగా... నెల్లూరు రోబో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.