కరోనా నుంచి బాధితులు త్వరగా కోలుకునేలా చర్యలు చేపట్టాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని క్యాజువాల్టి, కరోనా ఓపీ వార్డులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతోన్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్యుడు కె.సుధాకర్తో కలిసి కరోనా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనుమానిత లక్షణాలున్న వారికి కరోనా పరీక్షలు చేసి.. త్వరితగతిన ఫలితాలు ప్రకటించాలన్నారు.
ఇదీ చూడండి..