ETV Bharat / city

పులిచింతలలో హఠాత్తుగా తగ్గిన నీటి నిల్వ.. భారీగా చేపల మృత్యువాత - గుంటూరు

పులిచింతల ప్రాజెక్ట్​ 16వ నంబర్​ గేటు​ కొట్టుకుపోయిన కారణంగా... జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలకు పడిపోయింది. ఈ కారణంగా.. చాలినంత నీరు లేక పెద్ద మొత్తంలో చేపలు మృతి చెందాయి.

చేపల మృత్యువాత
చేపల మృత్యువాత
author img

By

Published : Aug 9, 2021, 10:47 PM IST

గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబరు గేటు కొట్టుకుపోయిన కారణంగా... ఒక్కసారిగా జలాశయం నుంచి నీరు కింద కు వెళ్లిపోయింది. భారీగా నీరు సముద్రం పాలు కాగా.. మత్స్యసంపద సైతం నేలపాలైంది.

ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలకు తగ్గిపోగా.. చేపపిల్లలు కిందకు కొట్టుకొచ్చాయి. దిగువన ఉన్న తండా ప్రజలు చేప పిల్లలను పట్టుకునేందుకు పోటీపడ్డారు. శ్వాసించేందుకు తగిననీరు లేక ఎక్కువ చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ గేటును స్టాప్​ లాకులతో మూయించేందుకు అధికారులు రెండ్రోజులపాటు శ్రమించారు. మరమ్మతుల కోసం జలాశయంలో ఉన్న నీటిని బయటకు విడిచిపెట్టేశారు.

గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద 16వ నంబరు గేటు కొట్టుకుపోయిన కారణంగా... ఒక్కసారిగా జలాశయం నుంచి నీరు కింద కు వెళ్లిపోయింది. భారీగా నీరు సముద్రం పాలు కాగా.. మత్స్యసంపద సైతం నేలపాలైంది.

ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 8 టీఎంసీలకు తగ్గిపోగా.. చేపపిల్లలు కిందకు కొట్టుకొచ్చాయి. దిగువన ఉన్న తండా ప్రజలు చేప పిల్లలను పట్టుకునేందుకు పోటీపడ్డారు. శ్వాసించేందుకు తగిననీరు లేక ఎక్కువ చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ గేటును స్టాప్​ లాకులతో మూయించేందుకు అధికారులు రెండ్రోజులపాటు శ్రమించారు. మరమ్మతుల కోసం జలాశయంలో ఉన్న నీటిని బయటకు విడిచిపెట్టేశారు.

ఇదీ చదవండి:

విరిగిన పులిచింతల ప్రాజెక్టు గేటు.. లక్ష క్యూసెక్కుల నీరు వృథా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.