ETV Bharat / city

గుంటూరు జిల్లాలో 583కు చేరిన కరోనా కేసులు - గుంటూరు జిల్లాలో కరోనా కేసుల వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా.. ఆరుగురికి పాజిటివ్​ నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 583కి చేరింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

గుంటూరు జిల్లాలో 583కి చేరిన కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో 583కి చేరిన కరోనా కేసులు
author img

By

Published : Jun 9, 2020, 8:22 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. తాజాగా.. నల్లపాడు, కేవీపీ కాలనీ, మద్దిరాల కాలనీ, లక్ష్మీపురం, దాచేపల్లి, నరసరావుపేటలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం కేసుల సంఖ్య 583కు చేరింది. గుంటూరు నగరంలో 222.. నరసరావుపేటలో 202 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు నిర్ధరణ అయ్యింది. తాజాగా.. నల్లపాడు, కేవీపీ కాలనీ, మద్దిరాల కాలనీ, లక్ష్మీపురం, దాచేపల్లి, నరసరావుపేటలో ఈ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు.

మొత్తం కేసుల సంఖ్య 583కు చేరింది. గుంటూరు నగరంలో 222.. నరసరావుపేటలో 202 కేసులు నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు.

ఇదీ చూడండి:

కాళహస్తిలో అర్చకుడికి కరోనా లక్షణాలు.. దర్శనాలు రద్దు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.