ETV Bharat / city

దిల్లీలో రైతులకు మద్ధతుగా బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ - దిల్లీలో రైతులకు మద్ధతుగా గుంటూరులో బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ

దిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు మద్ధతుగా.. గుంటూరులో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని హిందూ కళాశాల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన చేపట్టారు. రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

bc association supporting farmers
రైతులకు మద్ధతుగా బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ
author img

By

Published : Dec 5, 2020, 7:04 PM IST

నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్ధతుగా.. ఆ సంఘం నేతలు గుంటూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. హిందూ కళాశాల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 8న జరగనున్న దేశవ్యాప్త బంద్​లో.. బీసీలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శంకరరావు పిలుపునిచ్చారు. నేల తల్లిని నమ్ముకుని దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల సమస్యలపై.. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు.

నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని.. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. దిల్లీలో రైతుల ఆందోళనకు మద్ధతుగా.. ఆ సంఘం నేతలు గుంటూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. హిందూ కళాశాల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 8న జరగనున్న దేశవ్యాప్త బంద్​లో.. బీసీలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శంకరరావు పిలుపునిచ్చారు. నేల తల్లిని నమ్ముకుని దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతల సమస్యలపై.. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు.

ఇదీ చదవండి:

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.