ETV Bharat / city

34 వేల అమెరికన్ డాలర్లు, రూ.1.47 కోట్ల హవాలా మనీ పట్టివేత

author img

By

Published : Sep 8, 2020, 7:47 PM IST

విజయవాడ గొల్లపూడి వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీ హవాలా ముఠా గుట్టు రట్టు రట్టయింది. ఓ కారులో తరలిస్తున్న 34 వేల అమెరికన్ డాలర్లు, రూ.1.47 కోట్ల హవాలా మనీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై భవానీపురం పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు.

Vijayawada Task Force Police Busted Hawala Rocke
Vijayawada Task Force Police Busted Hawala Rocke

విజయవాడలో హవాలా ముఠా గుట్టు రట్టయింది. గొల్లపూడి వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కారును పరిశీలించగా...34 వేల అమెరికన్ డాలర్లు, రూ.1.47 కోట్ల హవాలా మనీ తరలిస్తున్నట్లు గుర్తించినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. నరసాపురం నుంచి హైదరాబాద్​ తీసుకెళ్తున్నట్లుగా తేలిందని వివరించారు.

ప్రవీణ్ జైన్ అనే వ్యక్తి ఈ దందాను అపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంటర్ స్టేట్ హవాలా రాకెట్‌గా గుర్తించామన్న సీపీ... నరసాపురం ప్రాంతంలో గల్ఫ్ నుంచి వచ్చేవారి వద్ద తక్కువ ధరకు డాలర్లు కొంటున్నారని వెల్లడించారు. హైదరాబాద్​లో ఎక్కువ ధరకు వాటిని అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై ఆదాయపు పన్ను అధికారుల విచారణతో పాటు... డాలర్ల హవాలపై ఈడీ కూడా విచారణ చేపట్టిందన్నారు. ఈ హవాలా రాకెట్​పై భవానీపురం పోలీసుస్టేషన్​లో కేసు నమోదు చేశామని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు.

విజయవాడలో హవాలా ముఠా గుట్టు రట్టయింది. గొల్లపూడి వద్ద టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఓ కారును పరిశీలించగా...34 వేల అమెరికన్ డాలర్లు, రూ.1.47 కోట్ల హవాలా మనీ తరలిస్తున్నట్లు గుర్తించినట్లు విజయవాడ సీపీ శ్రీనివాసులు తెలిపారు. నరసాపురం నుంచి హైదరాబాద్​ తీసుకెళ్తున్నట్లుగా తేలిందని వివరించారు.

ప్రవీణ్ జైన్ అనే వ్యక్తి ఈ దందాను అపరేట్ చేస్తున్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంటర్ స్టేట్ హవాలా రాకెట్‌గా గుర్తించామన్న సీపీ... నరసాపురం ప్రాంతంలో గల్ఫ్ నుంచి వచ్చేవారి వద్ద తక్కువ ధరకు డాలర్లు కొంటున్నారని వెల్లడించారు. హైదరాబాద్​లో ఎక్కువ ధరకు వాటిని అమ్ముకుంటున్నారని చెప్పారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై ఆదాయపు పన్ను అధికారుల విచారణతో పాటు... డాలర్ల హవాలపై ఈడీ కూడా విచారణ చేపట్టిందన్నారు. ఈ హవాలా రాకెట్​పై భవానీపురం పోలీసుస్టేషన్​లో కేసు నమోదు చేశామని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు.

ఇదీ చదవండి

400 ఏళ్ల నాటి 'వింత' చెరువు- 12 గ్రామాలకు ఇదే దిక్కు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.