ETV Bharat / city

విద్యార్థిని కొట్టి పడేసి.. కాళ్లతో తన్నిన వార్డెన్‌..!

Warden Attack on Student : తాను చెప్పినట్లు వినడం లేదనే ఆగ్రహంతో.. విద్యార్థిని కొట్టిపడేసి, కాళ్లతో తన్నాడు ఓ వార్డెన్! ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకుంది. మైనారిటీ గురుకుల కళాశాలలో జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

author img

By

Published : May 23, 2022, 2:58 PM IST

Warden Attack on Student
విద్యార్థినిపై వార్డెన్‌ విచక్షణారహితంగా దాడి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్​
విద్యార్థినిపై వార్డెన్‌ విచక్షణారహితంగా దాడి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్​

Warden Attack on Student : తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి తాను చెప్పినట్లు వినడం లేదని.. కళాశాల నిబంధనలు పాటించడంలేదని ఆగ్రహించిన వార్డెన్ ఆ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

కళాశాలలో పనిచేస్తున్న ఆర్ట్ టీచర్‌ ద్వారా ఈ వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్ట్ టీచర్​గా పని చేస్తున్న సాగర్‌కు, విద్యార్థిపై దాడిచేసిన డిప్యూటీ వార్డెన్‌ నయీమ్‌కు మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలో.. విద్యార్థి దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ గురించి తెలుసుకున్న సాగర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈనెల 11న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో.. తాజాగా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపిన ప్రిన్సిపాల్ సాబిద్ అలీ.. వార్డెన్‌ నయీమ్‌తోపాటు ఆర్ట్ టీచర్‌ సాగర్​నూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

విద్యార్థిపై దాడి చేసిన డిప్యూటీ వార్డెన్ నయూమ్‌కు వారం రోజుల క్రితమే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 'తాను చెప్పినట్లు వినకుండా డార్మిటరీ రూమ్‌కు వెళ్లాడని నయూమ్‌.. విద్యార్థిపై దాడి చేశాడు. మొదట పిడిగుద్దులు గుద్దిన నయీమ్.. విద్యార్థి కింద పడగా.. కాళ్లతో తన్నాడు'అని ప్రిన్సిపాల్ తెలిపారు. అతడిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి :

విద్యార్థినిపై వార్డెన్‌ విచక్షణారహితంగా దాడి.. సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్​

Warden Attack on Student : తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థి తాను చెప్పినట్లు వినడం లేదని.. కళాశాల నిబంధనలు పాటించడంలేదని ఆగ్రహించిన వార్డెన్ ఆ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సీసీటీవీలో రికార్డయి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

కళాశాలలో పనిచేస్తున్న ఆర్ట్ టీచర్‌ ద్వారా ఈ వీడియోలు బయటకు వచ్చాయి. ఆర్ట్ టీచర్​గా పని చేస్తున్న సాగర్‌కు, విద్యార్థిపై దాడిచేసిన డిప్యూటీ వార్డెన్‌ నయీమ్‌కు మధ్య విభేదాలున్నాయి. ఈ క్రమంలో.. విద్యార్థి దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ గురించి తెలుసుకున్న సాగర్.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈనెల 11న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో.. తాజాగా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు వెంటనే చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపిన ప్రిన్సిపాల్ సాబిద్ అలీ.. వార్డెన్‌ నయీమ్‌తోపాటు ఆర్ట్ టీచర్‌ సాగర్​నూ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

విద్యార్థిపై దాడి చేసిన డిప్యూటీ వార్డెన్ నయూమ్‌కు వారం రోజుల క్రితమే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 'తాను చెప్పినట్లు వినకుండా డార్మిటరీ రూమ్‌కు వెళ్లాడని నయూమ్‌.. విద్యార్థిపై దాడి చేశాడు. మొదట పిడిగుద్దులు గుద్దిన నయీమ్.. విద్యార్థి కింద పడగా.. కాళ్లతో తన్నాడు'అని ప్రిన్సిపాల్ తెలిపారు. అతడిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.