'అమరావతి గ్రాఫిక్స్ భవనాల పైనుంచి దూకుదాం.. వస్తారా?' - రాజధాని రైతుల ఆందోళన న్యూస్
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ.. వెలగపూడిలో చేస్తున్న దీక్ష 36వ రోజుకు చేరింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే.. పోలీసులు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని గ్రాఫిక్స్ లో చూపించారని వైకాపా నేతలు చేస్తున్న విమర్శలను తప్పుబట్టారు. ఆ భవనాలపై నుంచి అంతా కలిసి దూకుదామా.. అని సవాల్ విసిరారు. గ్రాఫిక్సే కాబట్టి ఎవరికీ దెబ్బలు తగలవని ఎద్దేవా చేశారు. భవనాలపై నుంచి పడి గాయాలపాలైతే.. గ్రాఫిక్స్ కాదని ఒప్పుకోవాలని అన్నారు. మరిన్ని వివరాలు వెలగపూడి నుంచి మా ప్రతినిధి అందిస్తారు.