- రూ.80 లక్షల సెల్ఫోన్లు మాయం
గుంటూరు జిల్లాలో కొత్త తరహా దొంగతనం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కంటైనర్లో రూ.80 లక్షల విలువైన సెల్ఫోన్లను దుండగులు అపహరించారు. కంటైనర్ రన్నింగ్లో ఉండగా.. వెంబడించి దోపిడీ చేయడం గమనార్హం. గుంటూరు అర్బన్ ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని నాలుగు సింహాల్లో.. మూడు సింహాలు మాయం కావడంపై రాజకీయపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయాల పవిత్రను ప్రభుత్వం కాపాడలేకపోతోందని ఆక్షేపించాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- సాయిబాబా విగ్రహం ధ్వంసం
కృష్ణా జిల్లా నిడమానూరు శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట ఉన్న విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భాజపా, తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- రీఛార్జి స్టేషన్ల ఏర్పాటు
ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీతో పాటు రీఛార్జి స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు కైనటిక్ గ్రీన్ ఎనర్జీ సంస్థ స్పష్టం చేసింది. ఆ సంస్థ ప్రతినిధులు, కైనటిక్ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థాపకురాలు సులజా ఫిరోడియా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- 'అర కోటి కరోనా కేసులనూ దేవుడి ఖాతాలోనే వేస్తారా?'
భారత్లో కరోనా కేసులు 50 లక్షలు దాటిన నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేసింది కాంగ్రెస్. కరోనా వ్యాప్తి కట్టడికి మోదీ సర్కార్ తీసుకున్న చర్యల గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు
బాబ్రీ మసీదు కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి ఎస్కే యాదవ్ ఆదేశించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- 'జీప్ రేస్'.. ఆ కిక్కే వేరప్పా!
కర్ణాటకలోని చిక్కమగళూరులో "ఆఫ్-రోడ్ జీప్ రేస్" నిర్వహించారు. కరోనా సంక్షోభం జరిగిన తొలి రేస్ కావడం వల్ల దీనికి విశేష ఆదరణ లభించింది. అడవులు, బురద, చెరువులు, కొండల మధ్య దాదాపు 30కిలోమీటర్ల పొడవున నిర్మించిన రేస్ ట్రాక్కు రైడర్లు ఫిదా అయిపోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- నెలలోపే అమెరికాకు వ్యాక్సిన్
ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోన్న తరుణంలో వ్యాక్సిన్పై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నవంబర్ కన్నా ముందే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఉద్ఘాటించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- ఈసారి ఐపీఎల్ మరింత స్పెషల్
ఐపీఎల్లో ధోనీ బ్యాటింగ్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. సెప్టెంబరు 19న చెన్నై ప్రారంభ మ్యాచ్ ముంబయితో ఆడనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- 3 వేల పాటలు పాడి రూ.85 లక్షల విరాళం సేకరణ
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద.. గత ఆరునెలల్లో దాదాపు 3 వేల ఆడియోలు రికార్డు చేసి శ్రోతలకు షేర్ చేశారు. తద్వారా వచ్చిన రూ.85 లక్షల విరాళాన్ని కరోనా బాధితుల కోసం వినియోగించనున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..