ETV Bharat / city

హైకోర్టు నూతన న్యాయమూర్తలకు ఘనంగా సన్మానం - ఏపీ హైకోర్టుకు నూతన న్యాయమూర్తులు

హైకోర్టులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం సన్మానించింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , హైకోర్టు న్యాయమూర్తులు , ఏజీ ఎస్.శ్రీరామ్ , న్యాయవాదులు హాజరు అయ్యారు.

High Court
High Court
author img

By

Published : Feb 25, 2022, 4:25 AM IST

ఏపీ హైకోర్టుకు నూతనంగా నియమితులై.. బాధ్యతలు చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శాలువలు కప్పి, జ్ఞాపికలను అందజేసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి , ఇతర కార్యవర్గం నేతృత్వంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , హైకోర్టు న్యాయమూర్తులు , ఏజీ ఎస్.శ్రీరామ్ , న్యాయవాదులు హాజరు అయ్యారు. సన్మానం అందుకున్న వారిలో జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి , జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ , జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు , జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు , జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి , జస్టిస్ చీమలపాటి రవి , జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఉన్నారు. వారి న్యాయప్రస్థానం గురించి కొద్దిసేపు మాట్లాడారు.

ఏపీ హైకోర్టుకు నూతనంగా నియమితులై.. బాధ్యతలు చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శాలువలు కప్పి, జ్ఞాపికలను అందజేసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి , ఇతర కార్యవర్గం నేతృత్వంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , హైకోర్టు న్యాయమూర్తులు , ఏజీ ఎస్.శ్రీరామ్ , న్యాయవాదులు హాజరు అయ్యారు. సన్మానం అందుకున్న వారిలో జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి , జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ , జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు , జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు , జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి , జస్టిస్ చీమలపాటి రవి , జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఉన్నారు. వారి న్యాయప్రస్థానం గురించి కొద్దిసేపు మాట్లాడారు.

ఇదీ చదవండి : PRC: జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం.. ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.