ETV Bharat / city

'మంత్రి గారూ.. నోటి పారుదల ఆపి నీటి పారుదలపై దృష్టి పెట్టండి' - మంత్రి అనిల్ కుమార్​పై కూన రవి కుమార్ విమర్శలు

"రాష్ట్రంలో నీటి మాఫియాకు తెర తీసిన మంత్రి అనిల్​ కుమార్... తెదేపాపై నిందలు వేయడం హాస్యాస్పదం" అని ఆ పార్టీ నేత కూన రవి కుమార్ ఆరోపించారు. అనిల్ కుమార్ నోటి పారుదల ఆపి నీటి పారుదలపై దృష్టిపెట్టాలన్నారు. ఏ అర్హతతో లోకేశ్​ను విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. నెల్లూరు పోలీసు రికార్డుల్లోని నేర చరిత్ర మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు.

కూన రవి కుమార్
కూన రవి కుమార్
author img

By

Published : Jun 15, 2020, 6:12 PM IST

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక దొరకాలంటే ఏపీఎండీసీ వెబ్​సైట్​లో కాకుండా తమ్మినేని సీతారాం డాట్ ఆన్​లైన్​లో బుక్ చేసుకోవాలని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. మంత్రి అనిల్ కుమార్​ నోటి పారుదల ఆపి... నీటి పారుదలపై దృష్టి సారించాలన్నారు. అనిల్ కుమార్ యాదవ్ నీటి పారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందని విమర్శించారు.

ఆయన మంత్రి అయ్యాకే నీటి మాఫియా మొదలైందన్నారు. సోమశిల ప్రాజెక్టులో 10 వేల క్యూసెక్కుల నీటిని అమ్ముకున్నారని వైకాపా నేతలే విమర్శించారని గుర్తుచేశారు. ఏ అర్హతతో లోకేశ్​పై విమర్శలు చేస్తారని నిలదీశారు. నెల్లూరు పోలీసు స్టేషన్​లోని రికార్డులు తీస్తే అనిల్ నేరచరిత్రను చెబుతాయని అన్నారు. బెట్టింగ్​ వ్యవహారాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను అమ్ముకుంటూ దోపిడికి పాల్పడుతున్న వైకాపా నేతలు తెదేపాపై నిందలు వేస్తున్నారన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక దొరకాలంటే ఏపీఎండీసీ వెబ్​సైట్​లో కాకుండా తమ్మినేని సీతారాం డాట్ ఆన్​లైన్​లో బుక్ చేసుకోవాలని తెదేపా నేత కూన రవికుమార్ ఆరోపించారు. మంత్రి అనిల్ కుమార్​ నోటి పారుదల ఆపి... నీటి పారుదలపై దృష్టి సారించాలన్నారు. అనిల్ కుమార్ యాదవ్ నీటి పారుదలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టులకు గ్రహణం పట్టిందని విమర్శించారు.

ఆయన మంత్రి అయ్యాకే నీటి మాఫియా మొదలైందన్నారు. సోమశిల ప్రాజెక్టులో 10 వేల క్యూసెక్కుల నీటిని అమ్ముకున్నారని వైకాపా నేతలే విమర్శించారని గుర్తుచేశారు. ఏ అర్హతతో లోకేశ్​పై విమర్శలు చేస్తారని నిలదీశారు. నెల్లూరు పోలీసు స్టేషన్​లోని రికార్డులు తీస్తే అనిల్ నేరచరిత్రను చెబుతాయని అన్నారు. బెట్టింగ్​ వ్యవహారాలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను అమ్ముకుంటూ దోపిడికి పాల్పడుతున్న వైకాపా నేతలు తెదేపాపై నిందలు వేస్తున్నారన్నారు.

ఇదీ చదవండి:

ప్రత్యేక పరిస్థితుల్లో... అసెంబ్లీ సమావేశాలు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.