ETV Bharat / city

యూపీలో ఘటన: రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ

author img

By

Published : Oct 4, 2020, 7:58 AM IST

హాథ్రాస్​లో జరిగిన అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీ నాయకులు శనివారం కొవ్వొత్తులతో ర్యాలీ చేసి తమ నిరసనను తెలిపారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

state wide candle rally on issue of hatras incident
హాథ్రాస్​ ఘటనపై కొవ్వొత్తులతో నిరసన

హాథ్రాస్​ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు, సంఘాల నాయకులు శనివారం కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్​ చేశారు.

విశాఖ జిల్లా

హాథ్రస్‌ ఘటనను నిరసిస్తూ విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వ తీరుపై వ్యతిరేక నినాదాలు చేశారు. దోషులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.

రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన దళితులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. హాథ్రస్‌ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్​ చేశారు.

కడప జిల్లా

కమలాపురం స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద సీపీఐ, బీఎస్పీ నాయకులు కొవ్వొత్తుల నిరసన చేశారు. హాథ్రాస్​ ఘటనకు యూపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. మైనర్​ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరి తీయాలన్నారు.

చిత్తూరు జిల్లా

హాథ్రాస్​ ఘటనకు నిరసిస్తూ నగిరిలో సీపీఐ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ఎస్సీ మహిళపై అత్యాచారం చేసిన దోషులను ఉరి తీయాలని డిమాండ్​ చేశారు. యూపీ ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

అనంతపురం జిల్లా

రాయదుర్గంలో శనివారం రాత్రి వాల్మీకి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన తెలిపారు. వినాయక సర్కిల్ నుంచి పాత బస్టాండ్ మీదుగా లక్ష్మి బజార్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. హాథ్రాస్​ ఘటనలో అత్యాచారానికి గురైన ఎస్సీ మహిళకు నివాళులర్పించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా వాల్మీకి బోయల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

హాథ్రాస్​ ఘటనపై ధర్మవరంలో ఐక్య దళిత సంఘాలు నిరసన

హాథ్రాస్​ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలు, సంఘాల నాయకులు శనివారం కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్​ చేశారు.

విశాఖ జిల్లా

హాథ్రస్‌ ఘటనను నిరసిస్తూ విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ శైలజానాథ్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వ తీరుపై వ్యతిరేక నినాదాలు చేశారు. దోషులను శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు.

రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన దళితులు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. హాథ్రస్‌ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్​ చేశారు.

కడప జిల్లా

కమలాపురం స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద సీపీఐ, బీఎస్పీ నాయకులు కొవ్వొత్తుల నిరసన చేశారు. హాథ్రాస్​ ఘటనకు యూపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. మైనర్​ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని ఉరి తీయాలన్నారు.

చిత్తూరు జిల్లా

హాథ్రాస్​ ఘటనకు నిరసిస్తూ నగిరిలో సీపీఐ పార్టీ నాయకులు కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ఎస్సీ మహిళపై అత్యాచారం చేసిన దోషులను ఉరి తీయాలని డిమాండ్​ చేశారు. యూపీ ప్రభుత్వం ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

అనంతపురం జిల్లా

రాయదుర్గంలో శనివారం రాత్రి వాల్మీకి సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన తెలిపారు. వినాయక సర్కిల్ నుంచి పాత బస్టాండ్ మీదుగా లక్ష్మి బజార్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. హాథ్రాస్​ ఘటనలో అత్యాచారానికి గురైన ఎస్సీ మహిళకు నివాళులర్పించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా వాల్మీకి బోయల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి :

హాథ్రాస్​ ఘటనపై ధర్మవరంలో ఐక్య దళిత సంఘాలు నిరసన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.