ETV Bharat / city

కొవిడ్‌ సంక్షోభంతో ఉపాధి గల్లంతు.. సొంతూళ్లలో వ్యవసాయం

author img

By

Published : Aug 10, 2020, 11:35 AM IST

పల్లె తల్లివంటిది... పట్నం ప్రియురాల్లాంటిదంటారు! కరోనా పుణ్యమా అని అది అనుభవంలోకి వచ్చింది చాలామందికి! కాసుల వేటో... కెరీర్‌ పాటో పాడుకుంటూ... తనను వదిలివెళ్ళిన చాలామందికి కరోనా కాలంలో మళ్ళీ ఆ పల్లెనే తల్లిలా ఆదరిస్తోంది. ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది. తనకలవాటైన రీతిలో ఉన్నదాంట్లోనే కలోగంజి అంటూ.. ఆకలి తీరుస్తుంది.

software engineerssoftware engineers
software engineerssoftware engineers

నాడు పల్లెల్లో పనుల్లేవంటూ పట్టణాలకు వలస బాట పట్టిన బిడ్డలు ఇప్పుడు కొవిడ్‌ సంక్షోభంతో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగొస్తుంటే సంతోషంగా పల్లె స్వాగతం పలుకుతోంది. ఏదో ఒక పని చూపిస్తూ.. అమ్మప్రేమను పంచుతోంది. కరోనాతో.. పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలు పిల్లలతో సహా ఇప్పుడు సొంతూళ్లకు చేరాయి. అక్కడే పొలం పనులు చేసుకుంటూ.. ఉపాధి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాయి.. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కొంతమంది పట్టణాల్లో ఇంటద్దెలు చెల్లిస్తున్నారు కూడా! ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా చాలాకాలం తరవాత తిరిగొచ్చిన ముఖాలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులు, ఏసీ గదుల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ సుఖంగా జీవించేవారు సైతం పొలాల్లో బురదలో దిగి పనిచేస్తుంటే గ్రామీణులు ఆశ్చర్యపోతున్నారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

  • రైతును అర్థం చేసుకున్నాం!

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజినీరింగ్‌ చదివి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కరోనా సంక్షోభంతో కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను తొలగించింది. ఇంటికొచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఇదే మండలం మహదేవునిపేట గ్రామానికి చెందిన గుండాల మల్లేశ్‌ హైదరాబాద్‌లోని ఓ జూనియర్‌ కళాశాల్లో అధ్యాపకునిగా పనిచేశాడు. కరోనా మహమ్మారి తగ్గకపోవడంతో కళాశాలలు తెరవక ఉపాధి కరవై సొంతూరుకు వచ్చాడు. తన పొలంలో పనులు చేసుకుంటున్నాడు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి ఫార్మాలో డిగ్రీ పూర్తి చేసి ఓ ఫార్మా కంపెనీలో గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా సదరు యాజమాన్యం ఉద్యోగులను తొలగించింది. కరుణాకర్‌రెడ్డి గ్రామానికి వచ్చి తన 5 ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ‘‘ఇంతకాలం ఉద్యోగాల ఒత్తిడిలో ఇన్ని నెలల కాలం స్వగ్రామాల్లో ఉండలేదు. ఇప్పుడు చాలాకాలం ఉండటం వల్ల పల్లె జీవన సౌందర్యాన్ని తనివి తీరా చూసే అవకాశం కలుగుతోంది. వ్యవసాయం చేయడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు స్వానుభవానికి వస్తున్నాయి. మనం తినే ఆహారాన్ని పండించడానికి ఎంత శ్రమ అవసరమో అర్థమైంది. పల్లెజీవనం, వ్యవసాయంలో ఉన్నంత స్వేచ్ఛ, ప్రశాంతత ఉద్యోగంలో ఎన్నటికీ ఉండ’’దని వారు స్పష్టం చేశారు.

  • స్వగ్రామంలో మూడెకరాల కౌలుసేద్యం

కరోనా నేపధ్యంలో పనులు దొరక్క ఉపాధి కరువై.. స్వగ్రామంలో సేద్యం చేసుకుంటున్నాం. నాలుగేళ్ల క్రితం స్థానికంగా పనులు దొరక్క హైదరాబాద్‌కు వలసవెళ్లి అక్కడ ఇంటి నిర్మాణ పనుల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్లం. మార్చిలో కరోనా వ్యాప్తి చెందడంతో పనులు లేక ఇంటికి వచ్చాం. మూడెకరాల వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలను సాగుచేస్తున్నా. ఖాళీ సమయాల్లో ఉపాధిహామీ, వ్యవసాయ పనులకు వెళ్తున్నాం. నగరం నుంచి తిరిగొచ్చినా పల్లెల్లో ఉపాధి పనులకు కొదవ లేదు. రోజూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నా... పట్నంలో ఇంటి కిరాయి కట్టలేక చాలీచాలని ఆదాయం... అస్తవ్యస్త జీవనం లాంటివి పల్లెల్లో లేవు. ఇక్కడే ప్రశాంతంగా ఉంది! - కావలి రాములు, మసిగుండ్లపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా

  • సాఫ్ట్‌వేర్‌ పోయి.. పొలం పనుల్లో బిజీ...

సాప్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డ వారిలో కొందరినీ కరోనా మహమ్మారి పల్లెలకు పంపింది. మిడ్జిల్‌ మండల కేంద్రానికి చెందిన ఎం.వెంకట్‌రెడ్డి నాలుగేళ్లుగా బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కరోనాతో కంపెనీ తాత్కాలికంగా మూసివేస్తున్నామని చెప్పడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. ‘‘పూర్తిస్థాయిలో ప్రాజెక్టును నిలిపివేస్తున్నామని ఇటీవల కంపెనీవారు సమాచారం ఇచ్చారు. తొలిసారి పొలంలోకి వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నా. ఇప్పుడు సేద్యంలో నిజమైన కష్టం ఏంటనేది తెలుస్తోంది. బెంగళూరు లాంటి మహానగరంలో ఉండే ట్రాఫిక్‌ రద్దీ, ఒత్తిడితో కూడిన జీవితం పల్లెల్లో లేవు’’ అని వెంకట్‌ అన్నారు.

నాడు పల్లెల్లో పనుల్లేవంటూ పట్టణాలకు వలస బాట పట్టిన బిడ్డలు ఇప్పుడు కొవిడ్‌ సంక్షోభంతో ఉపాధి కోల్పోయి సొంతూళ్లకు తిరిగొస్తుంటే సంతోషంగా పల్లె స్వాగతం పలుకుతోంది. ఏదో ఒక పని చూపిస్తూ.. అమ్మప్రేమను పంచుతోంది. కరోనాతో.. పట్టణాల్లో ఉపాధి కోల్పోయిన లక్షలాది కుటుంబాలు పిల్లలతో సహా ఇప్పుడు సొంతూళ్లకు చేరాయి. అక్కడే పొలం పనులు చేసుకుంటూ.. ఉపాధి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నాయి.. ఇక్కడ వచ్చే డబ్బులతోనే కొంతమంది పట్టణాల్లో ఇంటద్దెలు చెల్లిస్తున్నారు కూడా! ప్రస్తుతం ఏ పల్లెలో చూసినా చాలాకాలం తరవాత తిరిగొచ్చిన ముఖాలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యావంతులు, ఏసీ గదుల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ సుఖంగా జీవించేవారు సైతం పొలాల్లో బురదలో దిగి పనిచేస్తుంటే గ్రామీణులు ఆశ్చర్యపోతున్నారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

  • రైతును అర్థం చేసుకున్నాం!

నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన మాదిరెడ్డి బాల్‌రెడ్డి ఇంజినీరింగ్‌ చదివి హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కరోనా సంక్షోభంతో కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను తొలగించింది. ఇంటికొచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఇదే మండలం మహదేవునిపేట గ్రామానికి చెందిన గుండాల మల్లేశ్‌ హైదరాబాద్‌లోని ఓ జూనియర్‌ కళాశాల్లో అధ్యాపకునిగా పనిచేశాడు. కరోనా మహమ్మారి తగ్గకపోవడంతో కళాశాలలు తెరవక ఉపాధి కరవై సొంతూరుకు వచ్చాడు. తన పొలంలో పనులు చేసుకుంటున్నాడు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి ఫార్మాలో డిగ్రీ పూర్తి చేసి ఓ ఫార్మా కంపెనీలో గత పదేళ్లుగా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా సదరు యాజమాన్యం ఉద్యోగులను తొలగించింది. కరుణాకర్‌రెడ్డి గ్రామానికి వచ్చి తన 5 ఎకరాల పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ‘‘ఇంతకాలం ఉద్యోగాల ఒత్తిడిలో ఇన్ని నెలల కాలం స్వగ్రామాల్లో ఉండలేదు. ఇప్పుడు చాలాకాలం ఉండటం వల్ల పల్లె జీవన సౌందర్యాన్ని తనివి తీరా చూసే అవకాశం కలుగుతోంది. వ్యవసాయం చేయడం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు స్వానుభవానికి వస్తున్నాయి. మనం తినే ఆహారాన్ని పండించడానికి ఎంత శ్రమ అవసరమో అర్థమైంది. పల్లెజీవనం, వ్యవసాయంలో ఉన్నంత స్వేచ్ఛ, ప్రశాంతత ఉద్యోగంలో ఎన్నటికీ ఉండ’’దని వారు స్పష్టం చేశారు.

  • స్వగ్రామంలో మూడెకరాల కౌలుసేద్యం

కరోనా నేపధ్యంలో పనులు దొరక్క ఉపాధి కరువై.. స్వగ్రామంలో సేద్యం చేసుకుంటున్నాం. నాలుగేళ్ల క్రితం స్థానికంగా పనులు దొరక్క హైదరాబాద్‌కు వలసవెళ్లి అక్కడ ఇంటి నిర్మాణ పనుల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాళ్లం. మార్చిలో కరోనా వ్యాప్తి చెందడంతో పనులు లేక ఇంటికి వచ్చాం. మూడెకరాల వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలను సాగుచేస్తున్నా. ఖాళీ సమయాల్లో ఉపాధిహామీ, వ్యవసాయ పనులకు వెళ్తున్నాం. నగరం నుంచి తిరిగొచ్చినా పల్లెల్లో ఉపాధి పనులకు కొదవ లేదు. రోజూ ఎంతో కొంత సంపాదించుకుంటున్నా... పట్నంలో ఇంటి కిరాయి కట్టలేక చాలీచాలని ఆదాయం... అస్తవ్యస్త జీవనం లాంటివి పల్లెల్లో లేవు. ఇక్కడే ప్రశాంతంగా ఉంది! - కావలి రాములు, మసిగుండ్లపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా

  • సాఫ్ట్‌వేర్‌ పోయి.. పొలం పనుల్లో బిజీ...

సాప్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డ వారిలో కొందరినీ కరోనా మహమ్మారి పల్లెలకు పంపింది. మిడ్జిల్‌ మండల కేంద్రానికి చెందిన ఎం.వెంకట్‌రెడ్డి నాలుగేళ్లుగా బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కరోనాతో కంపెనీ తాత్కాలికంగా మూసివేస్తున్నామని చెప్పడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ ప్రశాంత జీవనం సాగిస్తున్నాడు. ‘‘పూర్తిస్థాయిలో ప్రాజెక్టును నిలిపివేస్తున్నామని ఇటీవల కంపెనీవారు సమాచారం ఇచ్చారు. తొలిసారి పొలంలోకి వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నా. ఇప్పుడు సేద్యంలో నిజమైన కష్టం ఏంటనేది తెలుస్తోంది. బెంగళూరు లాంటి మహానగరంలో ఉండే ట్రాఫిక్‌ రద్దీ, ఒత్తిడితో కూడిన జీవితం పల్లెల్లో లేవు’’ అని వెంకట్‌ అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.