ETV Bharat / city

కొనసాగుతున్న వరద ప్రవాహం... నీటిలోనే లోతట్టు ప్రాంతాలు

author img

By

Published : Oct 16, 2020, 10:50 AM IST

కృష్ణానదీ పరివాహకంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలానికి వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తుండటంతో ఆ ప్రవాహం పులిచింతల ప్రాజెక్ట్‌కు చేరుతోంది. ఎగువ నుంచి 6లక్షల 38వేల క్యూసెక్కులు నీరు పులిచింతల జలాశయానికి వచ్చి చేరుతుండటంతో పంటలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.

peoples problems due to release of flood water from reservoirs to down
జలాశయాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం... నీటిలోనే లోతట్టు ప్రాంతాలు

పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. అధికారులు 20 గేట్లు ఎత్తి 6 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 6లక్షల 38వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.58 టీఎంసీలుగా ఉంది.

నీటిలోనే పలు కాలనీలు

ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా వరద ప్రవాహం తగ్గుతుంది. బ్యారేజీ సామర్ధ్యం కంటే అధికంగా వరద నీరు వస్తుండటంతో 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికి రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్యారేజి దిగువ ప్రాంతాలైన కృష్ణలంక, భుపేష్ గుప్తా నగర్ కాలనీ, రామలింగేశ్వర నగర్ తదితర చోట్ల కొన్ని ఇళ్లు నీటమునిగే ఉన్నాయి.

జాగ్రత్తగా ఉండండి: కలెక్టర్ ఇంతియాజ్

ప్రస్తుతానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా... మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ సూచించారు. పైనుంచి వచ్చిన నీటినంతా దిగువకు వదిలేస్తున్నామని తెలిపారు. జగ్గయ్యపేట నుంచి నదీప్రవాహంలోని 18 మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలని... ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

శ్రీశైలం జలాశయం నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భారీగా నీరు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. శ్రీశైలం జలాశయం దిగువన ఉన్న మత్స్యకారుల గ్రామం లింగాలగట్టులో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.

మునిగిన పంటలు... ఆందోళనలో రైతులు

గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జిల్లాలోని నదీపరివాహక ప్రాంతంలోని పంటలు నీటిమునిగాయి. కష్టపడి సాగు చేసుకున్న పంటలు నీటమునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, ఫిరంగిపురం, పెదకూరపాడు, సత్తెనపల్లి, మేడికొండూరు, అమరావతి, తాడికొండ మండలాల పరిధిలో 2768.06 హెక్టార్లలో పంట పొలాలు వరద నీటిలోనే ఉన్నాయి. వరద నీరు తొలిగిన తర్వాత పంట నష్టం వివరాలను లెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి:

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

పులిచింతల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. అధికారులు 20 గేట్లు ఎత్తి 6 లక్షల 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ నుంచి 6లక్షల 38వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.58 టీఎంసీలుగా ఉంది.

నీటిలోనే పలు కాలనీలు

ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా వరద ప్రవాహం తగ్గుతుంది. బ్యారేజీ సామర్ధ్యం కంటే అధికంగా వరద నీరు వస్తుండటంతో 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికి రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్యారేజి దిగువ ప్రాంతాలైన కృష్ణలంక, భుపేష్ గుప్తా నగర్ కాలనీ, రామలింగేశ్వర నగర్ తదితర చోట్ల కొన్ని ఇళ్లు నీటమునిగే ఉన్నాయి.

జాగ్రత్తగా ఉండండి: కలెక్టర్ ఇంతియాజ్

ప్రస్తుతానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినా... మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ సూచించారు. పైనుంచి వచ్చిన నీటినంతా దిగువకు వదిలేస్తున్నామని తెలిపారు. జగ్గయ్యపేట నుంచి నదీప్రవాహంలోని 18 మండలాలు మరింత అప్రమత్తంగా ఉండాలని... ముందుజాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

శ్రీశైలం జలాశయం నుంచి సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. భారీగా నీరు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. శ్రీశైలం జలాశయం దిగువన ఉన్న మత్స్యకారుల గ్రామం లింగాలగట్టులో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది.

మునిగిన పంటలు... ఆందోళనలో రైతులు

గుంటూరు జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జిల్లాలోని నదీపరివాహక ప్రాంతంలోని పంటలు నీటిమునిగాయి. కష్టపడి సాగు చేసుకున్న పంటలు నీటమునగటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, ఫిరంగిపురం, పెదకూరపాడు, సత్తెనపల్లి, మేడికొండూరు, అమరావతి, తాడికొండ మండలాల పరిధిలో 2768.06 హెక్టార్లలో పంట పొలాలు వరద నీటిలోనే ఉన్నాయి. వరద నీరు తొలిగిన తర్వాత పంట నష్టం వివరాలను లెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి:

వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.