ETV Bharat / city

ఇంద్రకీలాద్రి ఔట్ సోర్సింగ్​ ఉద్యోగుల్లో విభేదాలు సృష్టిస్తారా?: పవన్ - pawan kalyan

ఇంద్రకీలాద్రిపై పని చేసే ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికి మాత్రమే పని కల్పిస్తూ... మరికొందరికి పని లేకుండా చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ తరహా చర్యలతో ఉద్యోగుల్లో విభేదాలు సృష్టిస్తారా అని ప్రశ్నించారు.

pawan kalyan
pawan kalyan
author img

By

Published : Jul 6, 2020, 7:04 PM IST

ఇంద్రకీలాద్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికి పని లేకుండా చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పదేళ్లుగా పని చేస్తున్న వారిలో కొందరికే పని కల్పిస్తున్నారని తెలిపారు. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ఆలయాలు మూసివేశారని.. ఈ కారణంగా ఆలయంలో పని చేసే కొందరినీ విధులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

pawan kalyan
జనసేన ప్రకటన

చిరుద్యోగుల్లో తారతమ్యాలు ఎందుకు సృష్టిస్తున్నారో దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు విధులకు కూడా పిలవడం లేదంటూ ఉద్యోగులు వాపోతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీతభత్యాలు అందని వారందరికీ చెల్లించాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి:

కరోనా మృతులకు అంత్యక్రియలతో వైరస్ వ్యాపిస్తుందా?

ఇంద్రకీలాద్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరికి పని లేకుండా చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పదేళ్లుగా పని చేస్తున్న వారిలో కొందరికే పని కల్పిస్తున్నారని తెలిపారు. కరోనా వల్ల దేశ వ్యాప్తంగా ఆలయాలు మూసివేశారని.. ఈ కారణంగా ఆలయంలో పని చేసే కొందరినీ విధులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

pawan kalyan
జనసేన ప్రకటన

చిరుద్యోగుల్లో తారతమ్యాలు ఎందుకు సృష్టిస్తున్నారో దేవాదాయశాఖ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు విధులకు కూడా పిలవడం లేదంటూ ఉద్యోగులు వాపోతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జీతభత్యాలు అందని వారందరికీ చెల్లించాలని కోరుతూ ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చదవండి:

కరోనా మృతులకు అంత్యక్రియలతో వైరస్ వ్యాపిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.