పీజీ మెడికల్, దంత వైద్య కోర్సుల్లో చేరే అభ్యర్థుల విషయంపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కౌన్సెలింగ్లో సీటు పొందిన వారిని కాలేజీల్లో చేర్చుకోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు వర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. వీరిని కాలేజీలో ఎందుకు చేర్చుకోవట్లేదో ఈనెల 8వ తేదీలోపు తెలపాలన్నారు. ఈ అంశాలపై స్పందించని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు షోకాజు నోటీసులిచ్చేందుకు వర్శిటీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ ఏడాది పీజీ మెడికల్ కౌన్సెలింగ్లో మొత్తం 14 మెడికల్ కాలేజీల్లో 618 మంది విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయించింది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఫీజులు తగ్గించిందనే నెపంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు ప్రవేశం ఇవ్వలేదు. ఈ నెల 4వ తేదీతో కాలేజీల్లో చేరేందుకు గడువు ముగియడంతో...అభ్యర్థులు 3,4 తేదీల్లో వర్శిటీలో ఆందోళనకు దిగారు. స్పందించిన వర్శిటీ అధికారులు... కాలేజిల్లో అభ్యర్థులు చేరేందుకు ఈ నెల 10 తేదీ వరకు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి: ఇకపై జేసీలకు బల్క్ అనుమతుల అధికారం