ETV Bharat / city

MP VIJAYA SAI REDDY: 'పార్లమెంట్​లో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించండి' - ap news

vijaya sai reddy met pm modi: గురువారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన ఎంపీ విజయ సాయిరెడ్డి.. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తిన రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కోరారు.

mp-vijayasai-reddy-has-appealed-to-prime-minister-modi-to-resolve-the-state-problems
'పార్లెంట్​లో లేవనెత్తిన సమస్యలు పరిష్కరించండి'
author img

By

Published : Dec 10, 2021, 10:53 AM IST

pm modi mp vijayasai reddy: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తిన ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో గురువారం ఆయన ప్రధానిని కలిశారు.

  • రాష్ట్రంలోని జల మార్గాల్లో నౌకా విహార పర్యాటకం, అందుకు అవసరమైన మౌలిక వసతులకు వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి పథకంలో కేంద్ర సహాయం కింద విశాఖపట్నం పోర్టు ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ కమ్‌ కోస్టల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మాణానికి రూ.38.50 కోట్లు, స్వదేశీ దర్శన్‌ కింద కోస్టల్‌ సర్క్యూట్‌లో కాకినాడ- హోప్‌ ఐలాండ్‌- కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం- పాశర్లపుడి- ఆదూరు- ఎస్‌.యానాం- కోటిపల్లికి రూ.67.84 కోట్లు, నెల్లూరు- పులికాట్‌ సరస్సు- ఉబ్బలమడుగు జలపాతం- నేలపట్టు- కొత్తకోడూరు- మైపాడు- రామతీర్థం- ఇస్కపల్లి తీరాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.49.55 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ బెర్తు, టెర్మినల్‌ భవన నిర్మాణానికి రూ.96.05 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

pm modi mp vijayasai reddy: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తిన ఆంధ్రప్రదేశ్‌ సమస్యలను పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో గురువారం ఆయన ప్రధానిని కలిశారు.

  • రాష్ట్రంలోని జల మార్గాల్లో నౌకా విహార పర్యాటకం, అందుకు అవసరమైన మౌలిక వసతులకు వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి పథకంలో కేంద్ర సహాయం కింద విశాఖపట్నం పోర్టు ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ కమ్‌ కోస్టల్‌ కార్గో టెర్మినల్‌ నిర్మాణానికి రూ.38.50 కోట్లు, స్వదేశీ దర్శన్‌ కింద కోస్టల్‌ సర్క్యూట్‌లో కాకినాడ- హోప్‌ ఐలాండ్‌- కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం- పాశర్లపుడి- ఆదూరు- ఎస్‌.యానాం- కోటిపల్లికి రూ.67.84 కోట్లు, నెల్లూరు- పులికాట్‌ సరస్సు- ఉబ్బలమడుగు జలపాతం- నేలపట్టు- కొత్తకోడూరు- మైపాడు- రామతీర్థం- ఇస్కపల్లి తీరాల్లో పర్యాటకాభివృద్ధికి రూ.49.55 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సాగరమాల పథకం కింద విశాఖపట్నం పోర్టు ఔటర్‌ హార్బర్‌లో క్రూయిజ్‌ టెర్మినల్‌ బెర్తు, టెర్మినల్‌ భవన నిర్మాణానికి రూ.96.05 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

ఇదీ చూడండి:

Lance Naik Sai Teja Death: నేడు స్వగ్రామానికి సాయితేజ మృతదేహం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.