ETV Bharat / city

'పోలవరంపై కేంద్రం అసంతృప్తి' - సుజనా చౌదరీ తాజా వార్తలు

రాజధానిలో రూ.9 వేల కోట్ల పనులు జరిగితే రూ.30 వేల కోట్ల దుబారా ఎలా సాధ్యమని భాజపా ఎంపీ సుజనా చౌదరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెవెన్యూలోటుపై గతప్రభుత్వపు తప్పుడు లెక్కలే జగన్‌ సర్కారూ చెబుతోందని ఆరోపించారు.

mp-sujana-chowdari
author img

By

Published : Oct 24, 2019, 6:05 PM IST

Updated : Oct 24, 2019, 6:17 PM IST

పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర జల శక్తి శాఖ అసంతృప్తితో ఉందని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండరు పిలిచినట్లుగా పోలవరం టెండర్లు పిలిచారని ఆరోపించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... రెవెన్యూ లోటు సహా ఇతర విషయాల్లో గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే జగన్ ప్రభుత్వం కూడా చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధిపై ఇంకా దృష్టి సారించలేదని వ్యాఖ్యానించారు.

కేంద్ర సాయం ఎక్కువే

గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికి అందనంత ఎక్కువ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిందని సుజనాచౌదరి అన్నారు. విభజన హామీల సాధన కోసం 22 మంది వైకాపా ఎంపీలు తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆక్షేపించారు. తెదేపా అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో ఉనికి లేని పార్టీతో స్నేహం, ఉనికి ఉన్న పార్టీతో యుద్ధం చేసి... వైకాపాకు ఎర్ర తివాచీ పరిచారని ఎద్దేవా చేశారు. 2023 నాటికి జమిలి ఎన్నికలు ఖాయమని.. అప్పుడు జాతీయవాదం - ప్రాంతీయ వాదం మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఈలోపు భారతీయ జనతా పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందనే ఆశాభావాన్ని సుజనాచౌదరి వ్యక్తం చేశారు.

పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై కేంద్ర జల శక్తి శాఖ అసంతృప్తితో ఉందని భాజపా ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండరు పిలిచినట్లుగా పోలవరం టెండర్లు పిలిచారని ఆరోపించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన... రెవెన్యూ లోటు సహా ఇతర విషయాల్లో గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే జగన్ ప్రభుత్వం కూడా చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధిపై ఇంకా దృష్టి సారించలేదని వ్యాఖ్యానించారు.

కేంద్ర సాయం ఎక్కువే

గత ఐదేళ్లలో ఏ రాష్ట్రానికి అందనంత ఎక్కువ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిందని సుజనాచౌదరి అన్నారు. విభజన హామీల సాధన కోసం 22 మంది వైకాపా ఎంపీలు తగిన ప్రయత్నాలు చేయడం లేదని ఆక్షేపించారు. తెదేపా అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో ఉనికి లేని పార్టీతో స్నేహం, ఉనికి ఉన్న పార్టీతో యుద్ధం చేసి... వైకాపాకు ఎర్ర తివాచీ పరిచారని ఎద్దేవా చేశారు. 2023 నాటికి జమిలి ఎన్నికలు ఖాయమని.. అప్పుడు జాతీయవాదం - ప్రాంతీయ వాదం మధ్య పోటీ జరుగుతుందన్నారు. ఈలోపు భారతీయ జనతా పార్టీ మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందనే ఆశాభావాన్ని సుజనాచౌదరి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

కర్తార్​పుర్​ నడవా​పై భారత్​-పాక్​ ఒప్పందం

Intro:ఒడిశాలో కురిసిన వర్షం శ్రీకాకుళం వాసులకు వరద ముప్పు నకు కారణమవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన నది అయిన వంశధార నదికి వరదల కారణంగా నదీ తీర గ్రామాల నష్టం వాటిల్లుతోంది. ఆక్రమణలకు అది ఇది అనేది లేదంటారు. చెరువులు గుట్టలు చివరకు స్మశానాలు కూడా ఆక్రమించి కబ్జాలకు పాల్పడుతున్నారు. కానీ శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రేవు అంపలం , గార మండలం కళింగపట్నం గ్రామాల మధ్య వంశధార నది భారీగా ఆక్రమణకు గురైంది . ఇక్కడ రెండు పాయలుగా చీలిక చేసి రొయ్యల చెరువులుగా మార్చేశారు. గత కొన్ని ఏళ్లుగా ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్నా, ఎవరికి అంతుచిక్కలేదు. తాజాగా ఈ యేడాది ఆగస్టు 7న వంశధార నదికి వరదలు సంభవించాయి. దీంతో కళింగపట్నం బీచ్ కొట్టుకుపోయింది . అధికారులు ఈ వైనం తో తుళ్ళి పడ్డారు . వంశధార నదిలో ఆక్రమణ కారణంగానే భారీ నష్టం జరిగిందని నిర్ధారించుకున్నారు. జిల్లా కలెక్టర్ నివాస్ స్పందించి దర్యాప్తు చేయాలంటూ చిన్న నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ బి రాంబాబుకు ఆదేశించారు. ఇదిలా ఉండగా వంశధార నదిలో ఆక్రమణలు విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమగ్ర దర్యాప్తు చేయాలంటూ నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ రౌతు సత్యనారాయణ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీని నియమించారు. ఇటీవల త్రిసభ్య కమిటీ రేవు అంపలం , కళింగపట్నం గ్రామాల నడుమ ఆక్రమణలకు గురైన వంశధార నది ప్రాంతాన్ని పరిశీలించింది. రేవు అంపలం సర్వే సంఖ్య 516 లో 25 ఎకరాలు నదీ ప్రాంతం ఆక్రమణలకు గురైన టు నిర్ధారించింది. దీంతో గత మూడు రోజులుగా నదిలో ఆక్రమణలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. శ్రీకాకుళం ఆర్డిఓ ఎన్.వి.రమణ ఆధ్వర్యంలో రెవెన్యూ , పోలీస్ , నీటిపారుదల శాఖ సిబ్బంది పరిరక్షణలో యంత్రాలతో ఆక్రమణలను తొలగిస్తున్నారు.


Body:నరసన్నపేట


Conclusion:9440319788
Last Updated : Oct 24, 2019, 6:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.