ETV Bharat / city

భద్రత తగ్గించడంపై మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఆగ్రహం

author img

By

Published : Jun 18, 2020, 11:39 AM IST

తనకు ఎస్కార్ట్‌ తొలగించడం, భద్రత తగ్గించడంపై శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. సంప్రదాయాలంటే ఇవేనా? ప్రభుత్వం కక్షగట్టి చేస్తున్నట్లుందని ధ్వజమెత్తారు.

mandali
mandali

మండలిలో.. ద్రవ్య వినిమయ బిల్లును చివరగా చర్చించాలనే సంప్రదాయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలా తీసుకోవడం ఎప్పటి నుంచో ఉందని వైకాపా వాదించింది. మధ్యలో తీసుకోవడం ద్వారా మనం చేసిందే సంప్రదాయంగా మారుతుందని డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. ఇలాంటి సంప్రదాయం సభ ప్రతిష్ఠ పెంచుతుందా? నలుగురు సభ్యులు ఎక్కువగా ఉన్నారని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాల్ని పక్కనపెట్టడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఫ్లోర్‌ లీడర్ల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. దీంతో.. స్పందించిన డిప్యూటీ ఛైర్మన్..

‘నన్ను మండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవి నుంచి మీరు దించాలనుకోవచ్చు. అప్పుడు కూడా కూర్చోవాలా? వద్దా? అని నేను ఫ్లోర్‌ లీడర్లను అడగాలా? సభ నిర్ణయిస్తుందా? నేను గత, ఇప్పటి ప్రభుత్వంలోనూ డిప్యూటీ ఛైర్మన్‌నే. అయినా భద్రత తొలగించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళితే మూడు నెలల కిందట పునరుద్ధరించారు. తర్వాత మళ్లీ ఒకరిని వెనక్కి పిలిపించారు. భద్రత కూడా తీసేశారు’ -డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం

తన హక్కులు తొలగించడం ఎందుకు... అవిశ్వాస తీర్మానం పెట్టి తనను దించేయండి అని డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాడు సంప్రదాయాలేమయ్యాయి: బొత్స

‘తమరి ఆవేదన, ఆవేశం అర్థం చేసుకున్నా. మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు భద్రత తొలగించారు, కుర్చీలూ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సంప్రదాయాలేమయ్యాయి’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు. దీంతో బొత్స, డిప్యూటీ ఛైర్మన్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తనను ప్రతిపక్ష నేతగా ప్రకటించడానికి నెల సమయం తీసుకున్నారని ఛీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. డిప్యూటీ ఛైర్మన్‌కు భద్రత ఇవ్వకపోవడం సరి కాదు.. ఆ విషయాన్ని మంత్రులు చూస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: 18 మంది సైనికులకు లేహ్​లో చికిత్స

మండలిలో.. ద్రవ్య వినిమయ బిల్లును చివరగా చర్చించాలనే సంప్రదాయంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అలా తీసుకోవడం ఎప్పటి నుంచో ఉందని వైకాపా వాదించింది. మధ్యలో తీసుకోవడం ద్వారా మనం చేసిందే సంప్రదాయంగా మారుతుందని డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం అన్నారు. ఇలాంటి సంప్రదాయం సభ ప్రతిష్ఠ పెంచుతుందా? నలుగురు సభ్యులు ఎక్కువగా ఉన్నారని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ నిర్ణయాల్ని పక్కనపెట్టడం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఫ్లోర్‌ లీడర్ల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. దీంతో.. స్పందించిన డిప్యూటీ ఛైర్మన్..

‘నన్ను మండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవి నుంచి మీరు దించాలనుకోవచ్చు. అప్పుడు కూడా కూర్చోవాలా? వద్దా? అని నేను ఫ్లోర్‌ లీడర్లను అడగాలా? సభ నిర్ణయిస్తుందా? నేను గత, ఇప్పటి ప్రభుత్వంలోనూ డిప్యూటీ ఛైర్మన్‌నే. అయినా భద్రత తొలగించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళితే మూడు నెలల కిందట పునరుద్ధరించారు. తర్వాత మళ్లీ ఒకరిని వెనక్కి పిలిపించారు. భద్రత కూడా తీసేశారు’ -డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం

తన హక్కులు తొలగించడం ఎందుకు... అవిశ్వాస తీర్మానం పెట్టి తనను దించేయండి అని డిప్యూటీ ఛైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాడు సంప్రదాయాలేమయ్యాయి: బొత్స

‘తమరి ఆవేదన, ఆవేశం అర్థం చేసుకున్నా. మాజీ కేంద్ర మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు భద్రత తొలగించారు, కుర్చీలూ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సంప్రదాయాలేమయ్యాయి’ అని మంత్రి బొత్స ప్రశ్నించారు. దీంతో బొత్స, డిప్యూటీ ఛైర్మన్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తనను ప్రతిపక్ష నేతగా ప్రకటించడానికి నెల సమయం తీసుకున్నారని ఛీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వివరించారు. డిప్యూటీ ఛైర్మన్‌కు భద్రత ఇవ్వకపోవడం సరి కాదు.. ఆ విషయాన్ని మంత్రులు చూస్తారని చెప్పారు.

ఇదీ చదవండి: 18 మంది సైనికులకు లేహ్​లో చికిత్స

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.