రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన లోకాయుక్త, ఉప లోకాయుక్త కార్యాలయాలు ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచే పని చేస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. విజయవాడలో ఈ రెండు కార్యాలయాలు నిర్మాణ దశలో ఉన్నందున తాత్కాలికంగా అక్కడి నుంచే పని చేస్తాయని తెలిపింది. హైదరాబాద్ బషీర్బాగ్లోని లోకాయుక్త సంస్థ నుంచే అధికారులు విధులు నిర్వహిస్తారని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఇలాగే కొనసాగుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇటీవలే ఏపీ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్రెడ్డి నియమితులయ్యారు.
ఇదీ చూడండి :