ETV Bharat / city

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలుకు కొత్త మార్గదర్శకాలివే..!

author img

By

Published : May 3, 2020, 11:54 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్​డౌన్​ నిబంధనలపై నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా గ్రీన్​, ఆరెంజ్​, రెడ్ జోన్లలో కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అయితే కంటెయిన్​మెంట్​ జోన్లలో మాత్రం ఆంక్షలు కఠినతరం చేసింది. రిస్కు ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలపై కఠినంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.

లాక్​డౌన్​ అమలుకు ప్రభుత్వ నూతన మార్గదర్శకాలివే..!
లాక్​డౌన్​ అమలుకు ప్రభుత్వ నూతన మార్గదర్శకాలివే..!

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్ అమలుకు మరికొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. వైరస్‌ వ్యాప్తి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఏపీలో జిల్లాలవారీగా 3 జోన్లను ప్రకటించింది.

జోన్ల వివరాలివే...

రాష్ట్రంలో విజయనగరం జిల్లా గ్రీన్​జోన్​లో ఉండగా.. రెడ్​జోన్లలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. మిగిలిన ఏడు జిల్లాలను ఆరెంజ్​ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. వైరస్​ వ్యాప్తి, కాంటాక్టులు, ఇతర అంశాల ఆధారంగా కంటైన్మెంట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

పట్టణాల్లో వార్డు, కాలనీని, గ్రామాల్లో పంచాయతీని కంటైన్​మెంట్​గా గుర్తించాలని తెలిపింది. కంటైన్మెంట్‌ క్లస్టర్‌కు అదనంగా 500 మీటర్ల నుంచి కిలోమీటర్ ప్రాంతం బఫర్‌జోన్​గా ఉంటుందని పేర్కొంది. కంటైన్‌మెంట్‌ను మిగతా ప్రాంతాలతో వేరు చేసేలా బారికేడ్లు వేయాలని ఆదేశించింది. రిస్కు ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలపై కఠినంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.

అనుమతి వీటికే...

రెడ్​జోన్​గ్రీన్​ జోన్​ఆరెంజ్​ జోన్​
ఔషధాలు, ఇతర నిత్యావసరాలుఔషధాలు, ఇతర నిత్యావసరాలుఔషధాలు, ఇతర నిత్యావసరాలు
అనుమతిచ్చిన కార్యకలాపాలకే ప్రైవేటు వాహనాలు అనుమతిప్రైవేటు వాహనాలకు పూర్తి అనుమతిట్యాక్సీ, క్యాబ్​లు(డ్రైవర్​, ఒక ప్యాసింజర్​), రిక్షాలు, అటోలు, ఆంక్షలతో ఇద్దరు ప్యాసింజర్లు
నిత్యావసరాలు అందించే ఈ-కామర్స్​ సైట్లుక్షౌరశాలలు, స్పాలు, సెలూన్‌లకు అనుమతి. నిబంధనలు తప్పనిసరిక్షౌరశాలలు, స్పాలు, సెలూన్‌లు(నిబంధనలు తప్పనిసరి)
సెజ్‌లు, ఎగుమతి, దిగుమతి యూనిట్లుషాపింగ్​ మాల్స్​ మినహా అన్ని దుకాణాలుషాపింగ్​ మాల్స్​ మినహా అన్ని దుకాణాలు
నిర్మాణ రంగ కార్యకలాపాలు(పరిమితంగా)పారిశ్రామిక కార్యకరలాపాలుపారిశ్రామిక కార్యకరలాపాలు
ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిగా.. ప్రైవేటు కార్యాలయాల్లో‌ 33 శాతం సిబ్బందితో పని చేసేందుకు అనుమతిహోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు)హోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు)
మద్యం, పాన్​ దుకాణాలు, హోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు)మద్యం, పాన్​ దుకాణాలుమద్యం, పాన్​ దుకాణాలు
వ్యవసాయ, ఉపాధి పనులువ్యవసాయ, ఉపాధి పనులువ్యవసాయ, ఉపాధి పనులు
  • జాతీయ రహదారుల్లో సరకు రవాణాకు అన్ని ప్రాంతాల్లోనూ అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

వీటికి అనుమతి లేదు

  • థియేటర్లు, మాల్స్, దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు
  • క్రీడా, రాజకీయ, సామాజిక సమావేశాలు, విద్యాసంస్థలు
  • కంటైన్మెంట్ ప్రాంతాల్లో హోటళ్లు
  • రైళ్లు, బస్సులు, విమానాలు, ప్రజా రవాణాపై నిషేధం
  • ప్రస్తుతం జిల్లాల మధ్య ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి లేదని స్పష్టం
  • రాత్రి 7 నుంచి ఉదయం 4 గంటల మధ్య ప్రజలు బయట తిరిగేందుకు వీల్లేదని సర్కారు తెలిపింది. రెడ్​జోన్​ జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

కంటెయిన్​మెంట్​​ జోన్లలో

కంటైన్మెంట్​ జోన్లలో నిబంధనలు కఠినం చేసింది ప్రభుత్వం. మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్​లు, మార్కెట్లకు ఈ జోన్లలో అనుమతి లేదు. మద్యం, పాన్​ దుకాణాలకు అనుమతి నిరాకరించింది. అయితే వ్యవసాయం, ఉపాధి పనులను చేసుకోవచ్చని.. పారిశ్రామిక, నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రైవేటు కార్యాలయాలకు ఈ జోన్లలో అనుమతి లేదని పేర్కొంది.

ఇదీ చూడండి..

జేఈఈ, నీట్​పై మే 5న కేంద్రం కీలక ప్రకటన

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్ అమలుకు మరికొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. వైరస్‌ వ్యాప్తి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఏపీలో జిల్లాలవారీగా 3 జోన్లను ప్రకటించింది.

జోన్ల వివరాలివే...

రాష్ట్రంలో విజయనగరం జిల్లా గ్రీన్​జోన్​లో ఉండగా.. రెడ్​జోన్లలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. మిగిలిన ఏడు జిల్లాలను ఆరెంజ్​ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. వైరస్​ వ్యాప్తి, కాంటాక్టులు, ఇతర అంశాల ఆధారంగా కంటైన్మెంట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

పట్టణాల్లో వార్డు, కాలనీని, గ్రామాల్లో పంచాయతీని కంటైన్​మెంట్​గా గుర్తించాలని తెలిపింది. కంటైన్మెంట్‌ క్లస్టర్‌కు అదనంగా 500 మీటర్ల నుంచి కిలోమీటర్ ప్రాంతం బఫర్‌జోన్​గా ఉంటుందని పేర్కొంది. కంటైన్‌మెంట్‌ను మిగతా ప్రాంతాలతో వేరు చేసేలా బారికేడ్లు వేయాలని ఆదేశించింది. రిస్కు ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలపై కఠినంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.

అనుమతి వీటికే...

రెడ్​జోన్​గ్రీన్​ జోన్​ఆరెంజ్​ జోన్​
ఔషధాలు, ఇతర నిత్యావసరాలుఔషధాలు, ఇతర నిత్యావసరాలుఔషధాలు, ఇతర నిత్యావసరాలు
అనుమతిచ్చిన కార్యకలాపాలకే ప్రైవేటు వాహనాలు అనుమతిప్రైవేటు వాహనాలకు పూర్తి అనుమతిట్యాక్సీ, క్యాబ్​లు(డ్రైవర్​, ఒక ప్యాసింజర్​), రిక్షాలు, అటోలు, ఆంక్షలతో ఇద్దరు ప్యాసింజర్లు
నిత్యావసరాలు అందించే ఈ-కామర్స్​ సైట్లుక్షౌరశాలలు, స్పాలు, సెలూన్‌లకు అనుమతి. నిబంధనలు తప్పనిసరిక్షౌరశాలలు, స్పాలు, సెలూన్‌లు(నిబంధనలు తప్పనిసరి)
సెజ్‌లు, ఎగుమతి, దిగుమతి యూనిట్లుషాపింగ్​ మాల్స్​ మినహా అన్ని దుకాణాలుషాపింగ్​ మాల్స్​ మినహా అన్ని దుకాణాలు
నిర్మాణ రంగ కార్యకలాపాలు(పరిమితంగా)పారిశ్రామిక కార్యకరలాపాలుపారిశ్రామిక కార్యకరలాపాలు
ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిగా.. ప్రైవేటు కార్యాలయాల్లో‌ 33 శాతం సిబ్బందితో పని చేసేందుకు అనుమతిహోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు)హోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు)
మద్యం, పాన్​ దుకాణాలు, హోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు)మద్యం, పాన్​ దుకాణాలుమద్యం, పాన్​ దుకాణాలు
వ్యవసాయ, ఉపాధి పనులువ్యవసాయ, ఉపాధి పనులువ్యవసాయ, ఉపాధి పనులు
  • జాతీయ రహదారుల్లో సరకు రవాణాకు అన్ని ప్రాంతాల్లోనూ అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

వీటికి అనుమతి లేదు

  • థియేటర్లు, మాల్స్, దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు
  • క్రీడా, రాజకీయ, సామాజిక సమావేశాలు, విద్యాసంస్థలు
  • కంటైన్మెంట్ ప్రాంతాల్లో హోటళ్లు
  • రైళ్లు, బస్సులు, విమానాలు, ప్రజా రవాణాపై నిషేధం
  • ప్రస్తుతం జిల్లాల మధ్య ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి లేదని స్పష్టం
  • రాత్రి 7 నుంచి ఉదయం 4 గంటల మధ్య ప్రజలు బయట తిరిగేందుకు వీల్లేదని సర్కారు తెలిపింది. రెడ్​జోన్​ జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

కంటెయిన్​మెంట్​​ జోన్లలో

కంటైన్మెంట్​ జోన్లలో నిబంధనలు కఠినం చేసింది ప్రభుత్వం. మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్​లు, మార్కెట్లకు ఈ జోన్లలో అనుమతి లేదు. మద్యం, పాన్​ దుకాణాలకు అనుమతి నిరాకరించింది. అయితే వ్యవసాయం, ఉపాధి పనులను చేసుకోవచ్చని.. పారిశ్రామిక, నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రైవేటు కార్యాలయాలకు ఈ జోన్లలో అనుమతి లేదని పేర్కొంది.

ఇదీ చూడండి..

జేఈఈ, నీట్​పై మే 5న కేంద్రం కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.