Liquor Sales in Telangana: తెలంగాణలో డిసెంబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మద్యం దుకాణాల్లో తొలిరోజు విక్రయాలు జోరుగా సాగాయి. ఒక్కరోజులోనే ఏకంగా రూ.150 కోట్లకు పైగా మద్యం అమ్ముడుపోయింది. నూతన మద్యం పాలసీలో భాగంగా రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలను ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసింది. నవంబర్ 9వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంది. మొత్తం 66,452 దరఖాస్తులు అందినట్లు ఆబ్కారీ శాఖ వెల్లడించింది. ఒక్కో మద్యం దుకాణానికి 25కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపింది.
![](https://assets.eenadu.net/article_img/gh-state6b_2.jpg)