ETV Bharat / city

KARVY CASE: ముగిసిన పార్థసారథి కస్టడీ.. కీలక సమాచారం సేకరణ! - karvy chairman parthasarathy case latest update

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజుల పాటు పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు.. బ్యాంకును మోసం చేసిన కేసులో పలు విషయాలు రాబట్టారు. డీమాట్ ఖాతాదారుల షేర్లను సొంత షేర్లుగా చూపించి బ్యాంకుల వద్ద రుణాలు ఏ విధంగా పొందారనే విషయాన్ని పార్థసారథిని అడిగి తెలుసుకున్నారు.

ముగిసిన పార్థసారథి కస్టడీ.. కీలక సమాచారం సేకరణ!
ముగిసిన పార్థసారథి కస్టడీ.. కీలక సమాచారం సేకరణ!
author img

By

Published : Aug 26, 2021, 8:24 PM IST

Updated : Aug 26, 2021, 9:46 PM IST

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజుల కస్టడీ ముగియటంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్​గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు.

పార్థసారథిని రెండు రోజుల పాటు ప్రశ్నించిన సీసీఎస్ పోలీసులు.. బ్యాంకును మోసం చేసిన కేసులో పలు విషయాలు రాబట్టారు. పెట్టుబడిదారులకు చెందిన డీమాట్ ఖాతాలోని షేర్లను తనఖా పెట్టడంతో పాటు.. వారి ఖాతాలో ఉన్న నగదును కూడా ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. డీమాట్ ఖాతాదారుల షేర్లను సొంత షేర్లుగా చూపించి బ్యాంకుల వద్ద రుణాలు ఏ విధంగా పొందారనే విషయాన్ని పార్థసారథిని అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కార్వీ సంస్థపై నమోదైన కేసులను పార్థసారథి వద్ద ప్రస్తావించారు.

సీసీఎస్​లో పార్థసారథిపై నమోదైన మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ కోరారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకును మోసం చేసి రూ.347 కోట్ల రుణం పొందారు. ఈ రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో పీటీ వారెంట్ ఇవ్వాలని నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 19న అరెస్ట్..

చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. బుధ, గురు రెండు రోజుల పాటు పార్థసారథిని సీసీఎస్‌లో ఉంచి ప్రశ్నించారు. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో పోలీసులు పార్థసారథిని ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తెలియకుండా షేర్లు తనఖా..

బ్యాంకు నుంచి రూ.137కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రతినిధులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో డీమాట్ ఖాతా ఉన్న పెట్టుబడిదారులకు తెలియకుండా పార్థసారథి, ఇతర డైరెక్టర్లు కలిసి షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టారు. కోట్ల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేశారు. కేసులో మరింత పురోగతి సాధించడానికి కస్టడీ ఇవ్వాలన్న పోలీసుల వాదనను అంగీకరిస్తూ నాంపల్లి న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

2009లోనే..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన డబ్బులను మళ్లించినట్లు కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై 2009లోనే కేసు నమోదైంది. ఆయన డీమాట్ ఖాతాలో రూ.5 లక్షలకు పైగా నగదు తనకు తెలియకుండా మళ్లించినట్లు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో భీమవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ మేనేజర్‌తో పాటు ఛైర్మన్ పార్థసారథి, వైస్ ప్రెసిడెంట్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక మేనేజర్ మాత్రమే న్యాయస్థానంలో విచారణకు హాజరవుతున్నారు.

పీటీ వారెంట్‌..

ఛైర్మన్ పార్థసారథి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇండస్ ఇండ్ బ్యాంకు కేసులో పార్థసారథిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో... భీమవరం పోలీసులు పీటీ వారెంట్‌పై పార్థసారథిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను సంప్రదించి శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలు అందించారు. రెండు, మూడు రోజుల్లో నాంపల్లి న్యాయస్థానంలో భీమవరం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

సెప్టెంబర్‌ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్థసారథి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజుల కస్టడీ ముగియటంతో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్థసారథిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంచల్​గూడ జైలుకు రిమాండ్​కు తరలించారు.

పార్థసారథిని రెండు రోజుల పాటు ప్రశ్నించిన సీసీఎస్ పోలీసులు.. బ్యాంకును మోసం చేసిన కేసులో పలు విషయాలు రాబట్టారు. పెట్టుబడిదారులకు చెందిన డీమాట్ ఖాతాలోని షేర్లను తనఖా పెట్టడంతో పాటు.. వారి ఖాతాలో ఉన్న నగదును కూడా ఇతర ఖాతాలకు మళ్లించినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. డీమాట్ ఖాతాదారుల షేర్లను సొంత షేర్లుగా చూపించి బ్యాంకుల వద్ద రుణాలు ఏ విధంగా పొందారనే విషయాన్ని పార్థసారథిని అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో కార్వీ సంస్థపై నమోదైన కేసులను పార్థసారథి వద్ద ప్రస్తావించారు.

సీసీఎస్​లో పార్థసారథిపై నమోదైన మరో కేసులో పోలీసులు పీటీ వారెంట్ కోరారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకును మోసం చేసి రూ.347 కోట్ల రుణం పొందారు. ఈ రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసులో పీటీ వారెంట్ ఇవ్వాలని నాంపల్లి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 19న అరెస్ట్..

చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్థసారథిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. బుధ, గురు రెండు రోజుల పాటు పార్థసారథిని సీసీఎస్‌లో ఉంచి ప్రశ్నించారు. ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో పోలీసులు పార్థసారథిని ఈ నెల 19న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

తెలియకుండా షేర్లు తనఖా..

బ్యాంకు నుంచి రూ.137కోట్ల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రతినిధులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో డీమాట్ ఖాతా ఉన్న పెట్టుబడిదారులకు తెలియకుండా పార్థసారథి, ఇతర డైరెక్టర్లు కలిసి షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టారు. కోట్ల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదు చేశారు. కేసులో మరింత పురోగతి సాధించడానికి కస్టడీ ఇవ్వాలన్న పోలీసుల వాదనను అంగీకరిస్తూ నాంపల్లి న్యాయస్థానం రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

2009లోనే..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన డబ్బులను మళ్లించినట్లు కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై 2009లోనే కేసు నమోదైంది. ఆయన డీమాట్ ఖాతాలో రూ.5 లక్షలకు పైగా నగదు తనకు తెలియకుండా మళ్లించినట్లు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో భీమవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ మేనేజర్‌తో పాటు ఛైర్మన్ పార్థసారథి, వైస్ ప్రెసిడెంట్ల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక మేనేజర్ మాత్రమే న్యాయస్థానంలో విచారణకు హాజరవుతున్నారు.

పీటీ వారెంట్‌..

ఛైర్మన్ పార్థసారథి ఒక్కసారి కూడా కోర్టులో హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఇండస్ ఇండ్ బ్యాంకు కేసులో పార్థసారథిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంతో... భీమవరం పోలీసులు పీటీ వారెంట్‌పై పార్థసారథిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను సంప్రదించి శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలు అందించారు. రెండు, మూడు రోజుల్లో నాంపల్లి న్యాయస్థానంలో భీమవరం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

సెప్టెంబర్‌ 1న కృష్ణా, గోదావరి బోర్డుల భేటీ

Last Updated : Aug 26, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.