ETV Bharat / city

'ఆందోళనకరంగా అతిసారం వ్యాధి... ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు' - karnulu dairrhea latest news

కర్నూలు జిల్లాలో అతిసారం వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. కలుషిత నీరు తాగి ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావటం ఆందోళన కలిగిస్తోంది . రెండురోజుల వ్యవధిలో నలుగురు మరణించడం సమస్యకు అద్దం పడుతోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.... కారణాలను అన్వేషిస్తున్నారు. త్వరితగతిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

diarrhea
కర్నూలు జిల్లాలో అతిసారం వ్యాధి
author img

By

Published : Apr 8, 2021, 9:19 AM IST

Updated : Apr 8, 2021, 10:15 AM IST

కర్నూలు జిల్లాలో ఆందోళనకరంగా అతిసారా వ్యాధి

90మందికి పైగా అస్వస్థత.. రెండురోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందటంతో.. కర్నూలు జిల్లా పాణ్యం, ఆదోని మండలాల్లో అతిసారం వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో వాంతులు, విరేచనాలతో.. 50మందికిపైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మంగళవారం హుస్సేన్, కిట్టయ్య అనే ఇద్దరు మృతి చెందగా.. బుధవారం మద్దమ్మ అనే మహిళ చికిత్సపొందుతూ మరణించారు. కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదోని పట్టణంలోని అరుణజ్యోతినగర్‌లో అతిసారంతో సుమారు 40 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. రంగమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పాణ్యం మాజీ MLA గౌరు చరిత.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలతో డీఎంహెచ్​వో గిడ్డయ్య, సబ్‌ కలెక్టర్ కల్పనాకుమారి.. బాధిత గ్రామాల్లో పర్యటించారు. నీటిని పరీక్షించేందుకు శాంపిల్స్‌ను ప్రయోగశాలలకు పంపించామన్నారు.

కలుషిత నీటిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. అందుకే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభణ వేళ... టీకాలు నిండుకుంటున్నాయ్‌..!

కర్నూలు జిల్లాలో ఆందోళనకరంగా అతిసారా వ్యాధి

90మందికి పైగా అస్వస్థత.. రెండురోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందటంతో.. కర్నూలు జిల్లా పాణ్యం, ఆదోని మండలాల్లో అతిసారం వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో వాంతులు, విరేచనాలతో.. 50మందికిపైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మంగళవారం హుస్సేన్, కిట్టయ్య అనే ఇద్దరు మృతి చెందగా.. బుధవారం మద్దమ్మ అనే మహిళ చికిత్సపొందుతూ మరణించారు. కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదోని పట్టణంలోని అరుణజ్యోతినగర్‌లో అతిసారంతో సుమారు 40 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. రంగమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పాణ్యం మాజీ MLA గౌరు చరిత.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలతో డీఎంహెచ్​వో గిడ్డయ్య, సబ్‌ కలెక్టర్ కల్పనాకుమారి.. బాధిత గ్రామాల్లో పర్యటించారు. నీటిని పరీక్షించేందుకు శాంపిల్స్‌ను ప్రయోగశాలలకు పంపించామన్నారు.

కలుషిత నీటిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. అందుకే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: కరోనా విజృంభణ వేళ... టీకాలు నిండుకుంటున్నాయ్‌..!

Last Updated : Apr 8, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.