ETV Bharat / city

పీపీఏలపై నాడు విమర్శలు...నేడు అదే బాటలో: కళా వెంకట్రావు

author img

By

Published : Nov 9, 2020, 3:12 PM IST

సౌర, పవన విద్యుత్ పీపీఏలపై గతంలో నానా రాద్ధాంతం చేసిన వైకాపా ప్రభుత్వం...ఇప్పుడు అంతకుమించిన రాయితీలతో కొత్త ఒప్పందం ఎలా చేసుకుందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. 25 ఏళ్ల ఒప్పందాన్ని తప్పుబట్టిన వైకాపా 30 ఏళ్లకు ఒప్పందం ఎలా చేసుకుందని విమర్శించారు. ఉత్పత్తి నిలిపివేసినా పరిహారం చెల్లిస్తాననడం, బకాయిలకు ప్రభుత్వ గ్యారెంటీ...ఇవన్నీ పెట్టుబడుల ఆకర్షణలో భాగమైతే గతంలో తెదేపాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తమని ఒప్పుకోవాలన్నారు.

Kalavenkatrao
Kalavenkatrao

సౌర, పవన విద్యుత్​ పీపీఏలపై తెదేపా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తప్పుబట్టిన వైకాపా సర్కార్, అంతకుమించిన రాయితీలతో కొత్త ఒప్పందం ఎలా చేసుకుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు నిలదీశారు. పీపీఏలు 25 ఏళ్ల ఒప్పందంపై నానా రాద్ధాంతం చేసిన వైకాపా... అంతకుమించిన రాయితీలతో 30 ఏళ్లకు కొత్త ఒప్పందానికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఉత్పత్తి నిలిపివేసినా పరిహారం చెల్లిస్తాననటం ఎవరి మెప్పు కోసమని కళా ప్రశ్నించారు. కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని చెప్పడం దేనికోసమని నిలదీశారు.

ఏపీజీఈసీఎల్​కు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను నేరుగా డెవలపర్లకు ఇస్తామని చెప్పడం ఎవరిని మెప్పించడం కోసమని మండిపడ్డారు. ప్లాంట్ పెట్టడానికి ఒక ఎకరానికి లీజు గత ప్రభుత్వం రూ.31,000 నిర్ణయిస్తే దానిని రూ.25,000 తగ్గించారన్నారు. ఇవన్నీ కొత్త పెట్టుబడుల ఆకర్షణలో భాగమే అంటున్న ప్రభుత్వం గతంలో తెదేపాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఒప్పుకుందన్నారు.

విద్వేషం, విషప్రచారం తప్ప ప్రభుత్వానికి విజ్ఞత లేదనడానికి ఇదో ఉదాహరణ. అబద్ధాలు, అసత్య ప్రచారం తప్ప జగన్ ప్రభుత్వానికి అభివృద్ధి తెలియదన్నది వాస్తవం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పీపీఏల గడువు కనీసం పాతికేళ్లు ఉండాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొనటం సలహాదారులు మాట తప్పినట్లా లేక జగన్ మడమ తిప్పినట్లా?

--కళా వెంకట్రావు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

ఇదీ చదవండి : రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన

సౌర, పవన విద్యుత్​ పీపీఏలపై తెదేపా ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తప్పుబట్టిన వైకాపా సర్కార్, అంతకుమించిన రాయితీలతో కొత్త ఒప్పందం ఎలా చేసుకుందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు నిలదీశారు. పీపీఏలు 25 ఏళ్ల ఒప్పందంపై నానా రాద్ధాంతం చేసిన వైకాపా... అంతకుమించిన రాయితీలతో 30 ఏళ్లకు కొత్త ఒప్పందానికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా ఉత్పత్తి నిలిపివేసినా పరిహారం చెల్లిస్తాననటం ఎవరి మెప్పు కోసమని కళా ప్రశ్నించారు. కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తుందని చెప్పడం దేనికోసమని నిలదీశారు.

ఏపీజీఈసీఎల్​కు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను నేరుగా డెవలపర్లకు ఇస్తామని చెప్పడం ఎవరిని మెప్పించడం కోసమని మండిపడ్డారు. ప్లాంట్ పెట్టడానికి ఒక ఎకరానికి లీజు గత ప్రభుత్వం రూ.31,000 నిర్ణయిస్తే దానిని రూ.25,000 తగ్గించారన్నారు. ఇవన్నీ కొత్త పెట్టుబడుల ఆకర్షణలో భాగమే అంటున్న ప్రభుత్వం గతంలో తెదేపాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఒప్పుకుందన్నారు.

విద్వేషం, విషప్రచారం తప్ప ప్రభుత్వానికి విజ్ఞత లేదనడానికి ఇదో ఉదాహరణ. అబద్ధాలు, అసత్య ప్రచారం తప్ప జగన్ ప్రభుత్వానికి అభివృద్ధి తెలియదన్నది వాస్తవం. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పీపీఏల గడువు కనీసం పాతికేళ్లు ఉండాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొనటం సలహాదారులు మాట తప్పినట్లా లేక జగన్ మడమ తిప్పినట్లా?

--కళా వెంకట్రావు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

ఇదీ చదవండి : రాష్ట్రంలో కేంద్ర బృందాల పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.