ETV Bharat / city

జూన్‌ తొలి వారంలో 'జగనన్న చేదోడు'

author img

By

Published : May 18, 2020, 8:51 AM IST

రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు జగనన్న చేదోడుగా అందించే 10 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని జూన్ తొలివారంలో ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది.

jagananna chedhodu scheme
జగనన్న చేదోడు పథకం

రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం అందించే ‘జగనన్న చేదోడు’ పథకాన్ని జూన్‌ తొలి వారంలో ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తికావొచ్చింది. ఈ పథకం కింద మొత్తం 2,50,015 మంది లబ్ధిదారులను గుర్తించింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మే 18 నుంచి 25 వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించనుంది.

జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాల ఆధారంగా వాలంటీర్లతో సామాజిక తనిఖీలు చేయించి 26న తుది జాబితా ఖరారు చేస్తుంది. ‘జగనన్న చేదోడు’ పథకం కింద సొంత దుకాణాలున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీల జీవనోపాధి పెంపునకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఏడాది సాయాన్ని ఈ జూన్‌లో ఇవ్వనుంది. సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు
జగనన్న చేదోడు పథకానికి మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద దుకాణాలను నమోదు చేసుకుని ఆయా వృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారికే సాయమందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఆధారంగా గ్రామ, వార్డు వాలంటీర్లతో తనిఖీలు చేయించి వచ్చిన దరఖాస్తుల్లో 3,27,364 మందిని అనర్హులుగా తేల్చారు.

రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం అందించే ‘జగనన్న చేదోడు’ పథకాన్ని జూన్‌ తొలి వారంలో ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తికావొచ్చింది. ఈ పథకం కింద మొత్తం 2,50,015 మంది లబ్ధిదారులను గుర్తించింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మే 18 నుంచి 25 వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించనుంది.

జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాల ఆధారంగా వాలంటీర్లతో సామాజిక తనిఖీలు చేయించి 26న తుది జాబితా ఖరారు చేస్తుంది. ‘జగనన్న చేదోడు’ పథకం కింద సొంత దుకాణాలున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీల జీవనోపాధి పెంపునకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఏడాది సాయాన్ని ఈ జూన్‌లో ఇవ్వనుంది. సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.

మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు
జగనన్న చేదోడు పథకానికి మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టం కింద దుకాణాలను నమోదు చేసుకుని ఆయా వృత్తులపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారికే సాయమందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఆధారంగా గ్రామ, వార్డు వాలంటీర్లతో తనిఖీలు చేయించి వచ్చిన దరఖాస్తుల్లో 3,27,364 మందిని అనర్హులుగా తేల్చారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలోనూ మే 31వ తేదీ వరకు లాక్​డౌన్ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.