ETV Bharat / city

కేన్సర్ పై అవిశ్రాంత కృషే.. అవార్డుకు నామినేట్ చేసింది: ఎన్నారై వైద్యులు ఘట్టమనేని

author img

By

Published : Nov 25, 2020, 7:12 PM IST

Updated : Nov 25, 2020, 8:01 PM IST

దాదాపు 45ఏళ్లుగా చిన్న పిల్లల కాన్సర్లపై చేస్తున్న అవిశ్రాంత పరిశోధనలే తనను యుకెలో ప్రతిష్టాత్మక ఎన్​హెచ్​ఎస్ పార్లమెంటరీ అవార్డుకు నామినేట్ చేశాయని ప్రముఖ ఎన్నారై వైద్యులు, విఖ్యాత కేన్సర్ నిపుణులు ఘట్టమనేని హనుమంతరావు అన్నారు. ఎన్​హెచ్​ఎస్ పార్లమెంటరీ అవార్డుకు నామినేషన్ పొందిన తుది ఏడుగురిలో ఆయన ఒకరు. దేశంలో విశిష్ట సేవలు అందించిన వైద్య నిపుణులకు బ్రిటన్ పార్లమెంట్ ఈ అవార్డు అందిస్తుంది. కృష్ణాజిల్లాకు చెందిన హనుమంతరావు ... 44 ఏళ్లుగా యుకేలోని మాంచెష్టర్ క్రిష్టీ ఆసుపత్రిలో క్లినికల్ ఆంకాలజిస్టుగా సేవలు అందిస్తున్నారు.. ఓ తెలుగు వ్యక్తి ఈ అవార్డుకు నామినేట్ కావడం ప్రతిష్టాత్మకమైన విషయం.. డాక్టర్ ఘట్టమనేని హనుమంతరావు గారు.. యు.కె నుంచి ఆన్ లైన్ లో 'ఈటీవీ భారత్ ముఖాముఖి'లో మాట్లాడారు.

interview with oncologist dr ghattamaneni hanumantha rao
interview with oncologist dr ghattamaneni hanumantha rao
డాక్టర్ ఘట్టమనేని హనుమంతరావు గారితో ఈటీవీ భారత్ ముఖాముఖి
  • నేషనల్ హెల్త్ సర్వీస్ పార్లమెంటరీ అవార్డుకు షార్ట్ లిస్ట్ అవ్వడం పై మీ స్పందన ఏంటి.. ?

సంతోషంగా ఉంది. నేను నామినేట్ అవుతానని అనుకోలేదు. ఆసుపత్రి వాళ్లు రికమండ్ చేస్తే... యుకే వాయువ్య ప్రాంతం నుంచి నా పేరును ఎంపీల కమిటీ సిఫారసు చేశారు. ఆశ్చర్యంగానూ.. సంతోషంగానూ ఉంది.

  • యుకేలో ఈ అవార్డుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి... ఎంపిక ఎలా జరుగుతుంది..?

ఎన్​హెచ్​ఎస్ ప్రారంభించి ఇప్పటికి 72 ఏళ్లు అయింది. ఒక్కో రంగంలో ఒక్కక్కరిని ఎంపిక చేస్తారు. ఇందులో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ కేటగిరికి నన్ను నామినేట్ చేశారు.

  • ఈ అవార్డును ఎక్కడ అందజేస్తారు.. ? ఇంతకు ముందు మన తెలుగు వారు ఎవరైనా దీనిని గెలుచుకున్నారా.. ?

దీనిని యుకే పార్లమెంట్​లో అందజేస్తారు. ఎన్​హెచ్​ఎస్ వ్యవస్థాపకదినం సందర్భంగా.. జూలై 7న ఇస్తారు. దీనికి ప్రత్యేకమైన బాధ్యతలుండవ్. కానీ అవార్డు పొందడం అనేది ఓ గౌరవం. గెలుపొందిన వారు ఆ తర్వాత అవార్డు ఎంపిక కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తారు.

  • యుకే ఆరోగ్య వ్యవస్థలో ఎన్​హెచ్​ఎస్ పాత్ర ఏంటి.. ? ఈ పార్లమెంటరీ అవార్డు గెలుచుకున్న వారి బాధ్యతలు ఏముంటాయి. ?

యుకేలోని నేషనల్ హెల్త్ సర్వీసు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా... గర్భం నుంచి గతించేవరకూ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడం అనేది ఎన్​హెచ్​ఎస్ ప్రధాన లక్ష్యం. ప్రజలు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పనిలేకుండా వైద్యులను సమకూరుస్తుంది. చాలా తక్కువ దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎన్​హెచ్​ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల ఆదరణ పొందుతోంది.

  • క్లినికల్ ఆంకాలజిస్ట్ అయిన మీరు.. పరిశోధన రంగంలోనూ.. అలాగే కమ్యూనిటీకి చేసిన సేవలను గుర్తించి.. మిమ్నల్ని బలపరుస్తున్నట్లు.... మీ పేరును ప్రతిపాదించిన పార్లమెంటేరియన్.. జెఫ్ స్మిత్ తెలిపారు.. మీరు చేసిన పరిశోధనలు, సేవ పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా..?

నేను ఇక్కడకు రాకముందే చండీగఢ్ పీజీఐలో కేన్సర్ వైద్యాన్ని అభ్యసించాను. ఆ తర్వాత ఓ కన్సల్టెంట్ ఆహ్వానంపై మాంచెష్టర్​లో చేరాను. పిల్లల కాన్సర్​పై ప్రత్యేక ఆసక్తితో 44ఏళ్లుగా ఈ రంగంలోనే పరిశోధనలు చేస్తున్నారు. చిన్నారులు, కౌమార వయసుల్లో కేన్సర్ అరుదు. నేను చేరిన కొత్తల్లో ఎలాంటి కేన్సర్లు వస్తాయన్న దానిపై అవగాహన లేదు. అప్పట్లో కేవలం 35శాతం మంది మాత్రమే జబ్బు నుంచి బయటపడేవారు. ఈ 44 ఏళ్ల కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ చేసి.. చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశాం. పిల్లల్లో కేన్సర్ కు చికిత్స ఎలా ఇవ్వాలో అవగాహన లేని స్థాయి నుంచి ఇప్పుడు 75శాతం వరకూ కేన్సర్లను నయం చేసే స్థితికి వచ్చాం. అంతర్జాతీయంగా పాల్గొని.. జాతీయ స్థాయిలో సమన్వయం చేసినవాడిని ఇన్నేళ్లలో నేనొక్కడినే.. నేను రిటైర్ అవుతుండటంతో నా స్థానంలో ఆరుగురుని నా ఆసుపత్రిలో నియమించారు. పెద్ద వాళ్ల లాగా కాన్సర్ చికిత్స అందించి.. ఏ ఐదేళ్ల జీవితాన్ని అందించడం కాదు.. చిన్న పిల్లల్లో చికిత్స అందిస్తే.. వారు 70-80ఏళ్ల వరకూ జీవిస్తారా అన్నది అప్పట్లో ఎలాంటి అవగాహన లేదు. నేను స్వీయానుభవంతో చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశాను. నేను చికిత్స అందించిన వందలాది మంది రోగులను నిరంతరం ఫాలోఅప్ చేస్తూ.. వచ్చాను.

  • మీరు పనిచేస్తున్న క్రిష్టే ఆసుపత్రి యూరోప్ లోనే అత్యుత్తమ కేన్సర్ ఇనిస్టిట్యూట్ అని చెబుతారు. చాలా వరకూ కేన్సర్ స్టేజింగ్ లు కూడా అక్కడ నిర్థరించారు.. ఆ ఆసుపత్రి ప్రత్యేకత ఏంటి.. ?

ఆ ఆసుపత్రి కేన్సర్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తుంది. నేను మొదటి నుంచి చిన్న పిల్లలు, టీనేజ్ యువత, బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్లకి చికిత్స అందిస్తూ వచ్చాను. నేను అందించిన చికిత్స.. దానికి వచ్చిన స్పందన అనేది నాకు సంతృప్తినిచ్చింది.

  • మీరు దాదాపు 44 ఏళ్లు ఆ ఆసుపత్రిలోనే వర్క్ చేస్తున్నారు.. ఇంత సుదీర్ఘంగా ఆ ఆసుపత్రిలో పనిచేసిన వారున్నారా.. ? మీకు ఆసుపత్రిలో ఉన్న అనుబంధం ఎలాంటిది.. ?

నలభై నాలుగు సంవత్సరాలు ఆసుపత్రుల్లో పనిచేసిన వారుంటారు. ఓ కన్సల్టెంట్ గా ఈ దేశానికి వచ్చి.. ఒకే ఆసుపత్రిలో 44 ఏళ్ల పాటు.. సేవలందించడం అరుదైన విషయమే.. ! నాకు తెలిసి చాలా తక్కువమంది ఉంటారు అనుకుంటా.. !

  • కేన్సర్ కు సంబంధించి.. మరో ప్రముఖ నిపుణులు నోరి దత్తాత్రేయుడు గారు.. కూడా మీకు సహాధ్యాయి. కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్న మీరు ప్రఖ్యాత అంకాలజిస్టులుగా మారారు. ఇది కాకతాళీయంగా జరిగిందా...?

నోరి దత్తాత్రేయుడు గారు, నేను కళాశాలలో రూమ్మేట్స్ కూడా.. ! ఇప్పటికీ ఆ స్నేహం ఉంది. ఆయన బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి విశేషంగా సేవలు అందిస్తున్నారు. నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తుంటారు. అప్పట్లో రేడియో థెరపీ లేదు. నేను చంఢీగఢ్ వెళ్లాను. దత్తాత్రేయుడు గారు హైదరాబాద్​లో పూర్తి చేశారు. కేన్సర్ చికిత్సా విధానం మీద ఇంట్రస్టుతో ఆ స్పెషలైజేషన్ చేశాం.

  • సాధారణంగా కేన్సర్ అంటే .. మధ్య వయసు దాటిన తర్వాత ఎక్కువ మందిలో బయటపడుతుంది. కానీ ఇప్పటికీ 19 ఏళ్ల లోపు వయసున్న వారు ఏటా 3 లక్షల మంది కేన్సర్ కారణంగానే చనిపోతున్నారు.. వీటిని నివారించడం ఎలా. ?

పెద్దవాళ్ల కేన్సర్ .. వయసు పెరుగుతున్న కొద్ది కణాల్లో వచ్చే మార్పును బట్టి కేన్సర్ గా మారుతుంది. కానీ పిల్లల్లో జన్యుపరమైన లోపాల వల్ల కానీ, లేకపోతే ఇన్ ఫెక్షన్ల వల్ల కానీ కణాలు కేన్సర్ కారకాలుగా మారతాయి. పిల్లల్లో వచ్చే కేన్సర్ కు .. పెద్ద వాళ్ల కేన్సర్ కు చాలా తేడా ఉంది. పిల్లల్లో వచ్చే కేన్సర్ చాలా వేగంగా విస్తరిస్తుంది. రోజుల్లోనే మార్పువస్తుంది. కేన్సర్ కణాలు బోన్ మారో, ఊపిరితిత్తులకు వేగంగా వ్యాపిస్తాయి. అయితే పిల్లల్లో కేన్సర్ కీమో థెరపీకి వేగంగా స్పందిస్తుంది. రేడియో థెరపీ ద్వారా 70శాతం వరకూ కేన్సర్ ను తగ్గించగలుగుతాం. పెద్దవాళ్లల్లో కేన్సర్ ను గుర్తించడానికే కొన్నిసార్లు ఏడాది పట్టొచ్చు. పిల్లల్లో స్క్రీనింగ్ వల్ల ఉపయోగం లేదు. రెండు మూడు వారాల్లో అనారోగ్యం బారిన పడతారు. వారికి లక్షణాలు కన్పించగానే .. చికిత్స చాలా వేగంగా ప్రారంభించాలి. రోజుల్లోనే చికిత్స ప్రారంభించాలి.

  • వ్యాధిని గుర్తించడంలో యు.కె, యు.ఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎంత ముందంజలో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న సమస్యలు ఏంటి.. ?

భారత్​లోని కేన్సర్ సెంటర్ల గురించి నాకు అవగాహన ఉంది. పెద్ద నగరాల్లో పిల్లలకు చికిత్స అందించడానికి సదుపాయాలున్నాయి. అయితే చిన్న పట్టణాలు, గ్రామాల్లో కేన్సర్ ను గుర్తించే వ్యవస్థ లేదు. వారు తొందరగా గుర్తించకపోవడం వల్ల సమస్య తలెత్తుతోంది. గుర్తించడం ఆలస్యం అవుతుండటం వల్లనే కేన్సర్ నయమయ్యే రేటు తగ్గిపోతోంది. అందుకే ఏ మాత్రం లక్షణాలు కన్పించినా.. అనుమానాలున్నా.. వెంటనే ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి చికిత్స ప్రారంభించాలి.

  • ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది... కరోనా.. కేన్సర్ వంటి జబ్బులున్న వారికి ఇది ప్రమాదకరం అని ముందు నుంచీ చెబుతున్నారు. కేన్సర్ ఉన్న వారు.. కరోనాతో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. ?

కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమెథెరపీ , రేడియోథెరపీ వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాపిస్తే.. వారికి యాంటీబాడీలు తయారు కావు. అందువల్ల వారిలో కరోనా తీవ్రత పెరిగి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే కరోనా ప్రారంభం అయ్యాక మేము ప్రాథమిక స్థాయిలో.. పరీక్షల కోసం కీమో థెరఫీ ఇవ్వడం తగ్గించాం. రోగనిరోధక శక్తి తగ్గడం వల్లనే చనిపోతారు కానీ నేరుగా కేన్సర్ వల్ల సమస్య ఉండదు.

  • ప్రస్తుతం అవార్డుకు నామినేట్ అయ్యారు. జాతీయ స్థాయి అవార్డు సాధించడంపై మీకున్న అంచనా ఏంటి.. ?

ప్రస్తుతం మా నార్త్ వెస్ట్ రీజియన్ నుంచి నన్ను నామినేట్ చేశారు. అలా ఏడు ప్రాంతాల నుంచి ఏడుగురుని ఎంపిక చేశారు. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుల బృందం, వైద్య నిపుణులు, ఇంతకు ముందు ఈ అవార్డు గెలుచుకున్న వారు.. అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎంపిక చేస్తారు.

ఇదీ చదవండి

తెలుగు వైద్యుడికి బ్రిటన్​ ఉన్నత పురస్కారం

డాక్టర్ ఘట్టమనేని హనుమంతరావు గారితో ఈటీవీ భారత్ ముఖాముఖి
  • నేషనల్ హెల్త్ సర్వీస్ పార్లమెంటరీ అవార్డుకు షార్ట్ లిస్ట్ అవ్వడం పై మీ స్పందన ఏంటి.. ?

సంతోషంగా ఉంది. నేను నామినేట్ అవుతానని అనుకోలేదు. ఆసుపత్రి వాళ్లు రికమండ్ చేస్తే... యుకే వాయువ్య ప్రాంతం నుంచి నా పేరును ఎంపీల కమిటీ సిఫారసు చేశారు. ఆశ్చర్యంగానూ.. సంతోషంగానూ ఉంది.

  • యుకేలో ఈ అవార్డుకు ఉన్న ప్రాధాన్యత ఏంటి... ఎంపిక ఎలా జరుగుతుంది..?

ఎన్​హెచ్​ఎస్ ప్రారంభించి ఇప్పటికి 72 ఏళ్లు అయింది. ఒక్కో రంగంలో ఒక్కక్కరిని ఎంపిక చేస్తారు. ఇందులో లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ కేటగిరికి నన్ను నామినేట్ చేశారు.

  • ఈ అవార్డును ఎక్కడ అందజేస్తారు.. ? ఇంతకు ముందు మన తెలుగు వారు ఎవరైనా దీనిని గెలుచుకున్నారా.. ?

దీనిని యుకే పార్లమెంట్​లో అందజేస్తారు. ఎన్​హెచ్​ఎస్ వ్యవస్థాపకదినం సందర్భంగా.. జూలై 7న ఇస్తారు. దీనికి ప్రత్యేకమైన బాధ్యతలుండవ్. కానీ అవార్డు పొందడం అనేది ఓ గౌరవం. గెలుపొందిన వారు ఆ తర్వాత అవార్డు ఎంపిక కమిటీల్లో బాధ్యతలు నిర్వర్తిస్తారు.

  • యుకే ఆరోగ్య వ్యవస్థలో ఎన్​హెచ్​ఎస్ పాత్ర ఏంటి.. ? ఈ పార్లమెంటరీ అవార్డు గెలుచుకున్న వారి బాధ్యతలు ఏముంటాయి. ?

యుకేలోని నేషనల్ హెల్త్ సర్వీసు.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా... గర్భం నుంచి గతించేవరకూ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించడం అనేది ఎన్​హెచ్​ఎస్ ప్రధాన లక్ష్యం. ప్రజలు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన పనిలేకుండా వైద్యులను సమకూరుస్తుంది. చాలా తక్కువ దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎన్​హెచ్​ఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రజల ఆదరణ పొందుతోంది.

  • క్లినికల్ ఆంకాలజిస్ట్ అయిన మీరు.. పరిశోధన రంగంలోనూ.. అలాగే కమ్యూనిటీకి చేసిన సేవలను గుర్తించి.. మిమ్నల్ని బలపరుస్తున్నట్లు.... మీ పేరును ప్రతిపాదించిన పార్లమెంటేరియన్.. జెఫ్ స్మిత్ తెలిపారు.. మీరు చేసిన పరిశోధనలు, సేవ పట్ల మీరు సంతృప్తికరంగా ఉన్నారా..?

నేను ఇక్కడకు రాకముందే చండీగఢ్ పీజీఐలో కేన్సర్ వైద్యాన్ని అభ్యసించాను. ఆ తర్వాత ఓ కన్సల్టెంట్ ఆహ్వానంపై మాంచెష్టర్​లో చేరాను. పిల్లల కాన్సర్​పై ప్రత్యేక ఆసక్తితో 44ఏళ్లుగా ఈ రంగంలోనే పరిశోధనలు చేస్తున్నారు. చిన్నారులు, కౌమార వయసుల్లో కేన్సర్ అరుదు. నేను చేరిన కొత్తల్లో ఎలాంటి కేన్సర్లు వస్తాయన్న దానిపై అవగాహన లేదు. అప్పట్లో కేవలం 35శాతం మంది మాత్రమే జబ్బు నుంచి బయటపడేవారు. ఈ 44 ఏళ్ల కాలంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ చేసి.. చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశాం. పిల్లల్లో కేన్సర్ కు చికిత్స ఎలా ఇవ్వాలో అవగాహన లేని స్థాయి నుంచి ఇప్పుడు 75శాతం వరకూ కేన్సర్లను నయం చేసే స్థితికి వచ్చాం. అంతర్జాతీయంగా పాల్గొని.. జాతీయ స్థాయిలో సమన్వయం చేసినవాడిని ఇన్నేళ్లలో నేనొక్కడినే.. నేను రిటైర్ అవుతుండటంతో నా స్థానంలో ఆరుగురుని నా ఆసుపత్రిలో నియమించారు. పెద్ద వాళ్ల లాగా కాన్సర్ చికిత్స అందించి.. ఏ ఐదేళ్ల జీవితాన్ని అందించడం కాదు.. చిన్న పిల్లల్లో చికిత్స అందిస్తే.. వారు 70-80ఏళ్ల వరకూ జీవిస్తారా అన్నది అప్పట్లో ఎలాంటి అవగాహన లేదు. నేను స్వీయానుభవంతో చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశాను. నేను చికిత్స అందించిన వందలాది మంది రోగులను నిరంతరం ఫాలోఅప్ చేస్తూ.. వచ్చాను.

  • మీరు పనిచేస్తున్న క్రిష్టే ఆసుపత్రి యూరోప్ లోనే అత్యుత్తమ కేన్సర్ ఇనిస్టిట్యూట్ అని చెబుతారు. చాలా వరకూ కేన్సర్ స్టేజింగ్ లు కూడా అక్కడ నిర్థరించారు.. ఆ ఆసుపత్రి ప్రత్యేకత ఏంటి.. ?

ఆ ఆసుపత్రి కేన్సర్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తుంది. నేను మొదటి నుంచి చిన్న పిల్లలు, టీనేజ్ యువత, బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్లకి చికిత్స అందిస్తూ వచ్చాను. నేను అందించిన చికిత్స.. దానికి వచ్చిన స్పందన అనేది నాకు సంతృప్తినిచ్చింది.

  • మీరు దాదాపు 44 ఏళ్లు ఆ ఆసుపత్రిలోనే వర్క్ చేస్తున్నారు.. ఇంత సుదీర్ఘంగా ఆ ఆసుపత్రిలో పనిచేసిన వారున్నారా.. ? మీకు ఆసుపత్రిలో ఉన్న అనుబంధం ఎలాంటిది.. ?

నలభై నాలుగు సంవత్సరాలు ఆసుపత్రుల్లో పనిచేసిన వారుంటారు. ఓ కన్సల్టెంట్ గా ఈ దేశానికి వచ్చి.. ఒకే ఆసుపత్రిలో 44 ఏళ్ల పాటు.. సేవలందించడం అరుదైన విషయమే.. ! నాకు తెలిసి చాలా తక్కువమంది ఉంటారు అనుకుంటా.. !

  • కేన్సర్ కు సంబంధించి.. మరో ప్రముఖ నిపుణులు నోరి దత్తాత్రేయుడు గారు.. కూడా మీకు సహాధ్యాయి. కర్నూలు మెడికల్ కాలేజీలో చదువుకున్న మీరు ప్రఖ్యాత అంకాలజిస్టులుగా మారారు. ఇది కాకతాళీయంగా జరిగిందా...?

నోరి దత్తాత్రేయుడు గారు, నేను కళాశాలలో రూమ్మేట్స్ కూడా.. ! ఇప్పటికీ ఆ స్నేహం ఉంది. ఆయన బసవతారకం కాన్సర్ ఆసుపత్రికి విశేషంగా సేవలు అందిస్తున్నారు. నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తుంటారు. అప్పట్లో రేడియో థెరపీ లేదు. నేను చంఢీగఢ్ వెళ్లాను. దత్తాత్రేయుడు గారు హైదరాబాద్​లో పూర్తి చేశారు. కేన్సర్ చికిత్సా విధానం మీద ఇంట్రస్టుతో ఆ స్పెషలైజేషన్ చేశాం.

  • సాధారణంగా కేన్సర్ అంటే .. మధ్య వయసు దాటిన తర్వాత ఎక్కువ మందిలో బయటపడుతుంది. కానీ ఇప్పటికీ 19 ఏళ్ల లోపు వయసున్న వారు ఏటా 3 లక్షల మంది కేన్సర్ కారణంగానే చనిపోతున్నారు.. వీటిని నివారించడం ఎలా. ?

పెద్దవాళ్ల కేన్సర్ .. వయసు పెరుగుతున్న కొద్ది కణాల్లో వచ్చే మార్పును బట్టి కేన్సర్ గా మారుతుంది. కానీ పిల్లల్లో జన్యుపరమైన లోపాల వల్ల కానీ, లేకపోతే ఇన్ ఫెక్షన్ల వల్ల కానీ కణాలు కేన్సర్ కారకాలుగా మారతాయి. పిల్లల్లో వచ్చే కేన్సర్ కు .. పెద్ద వాళ్ల కేన్సర్ కు చాలా తేడా ఉంది. పిల్లల్లో వచ్చే కేన్సర్ చాలా వేగంగా విస్తరిస్తుంది. రోజుల్లోనే మార్పువస్తుంది. కేన్సర్ కణాలు బోన్ మారో, ఊపిరితిత్తులకు వేగంగా వ్యాపిస్తాయి. అయితే పిల్లల్లో కేన్సర్ కీమో థెరపీకి వేగంగా స్పందిస్తుంది. రేడియో థెరపీ ద్వారా 70శాతం వరకూ కేన్సర్ ను తగ్గించగలుగుతాం. పెద్దవాళ్లల్లో కేన్సర్ ను గుర్తించడానికే కొన్నిసార్లు ఏడాది పట్టొచ్చు. పిల్లల్లో స్క్రీనింగ్ వల్ల ఉపయోగం లేదు. రెండు మూడు వారాల్లో అనారోగ్యం బారిన పడతారు. వారికి లక్షణాలు కన్పించగానే .. చికిత్స చాలా వేగంగా ప్రారంభించాలి. రోజుల్లోనే చికిత్స ప్రారంభించాలి.

  • వ్యాధిని గుర్తించడంలో యు.కె, యు.ఎస్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎంత ముందంజలో ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న సమస్యలు ఏంటి.. ?

భారత్​లోని కేన్సర్ సెంటర్ల గురించి నాకు అవగాహన ఉంది. పెద్ద నగరాల్లో పిల్లలకు చికిత్స అందించడానికి సదుపాయాలున్నాయి. అయితే చిన్న పట్టణాలు, గ్రామాల్లో కేన్సర్ ను గుర్తించే వ్యవస్థ లేదు. వారు తొందరగా గుర్తించకపోవడం వల్ల సమస్య తలెత్తుతోంది. గుర్తించడం ఆలస్యం అవుతుండటం వల్లనే కేన్సర్ నయమయ్యే రేటు తగ్గిపోతోంది. అందుకే ఏ మాత్రం లక్షణాలు కన్పించినా.. అనుమానాలున్నా.. వెంటనే ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి చికిత్స ప్రారంభించాలి.

  • ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది... కరోనా.. కేన్సర్ వంటి జబ్బులున్న వారికి ఇది ప్రమాదకరం అని ముందు నుంచీ చెబుతున్నారు. కేన్సర్ ఉన్న వారు.. కరోనాతో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.. ?

కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమెథెరపీ , రేడియోథెరపీ వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో కరోనా వ్యాపిస్తే.. వారికి యాంటీబాడీలు తయారు కావు. అందువల్ల వారిలో కరోనా తీవ్రత పెరిగి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే కరోనా ప్రారంభం అయ్యాక మేము ప్రాథమిక స్థాయిలో.. పరీక్షల కోసం కీమో థెరఫీ ఇవ్వడం తగ్గించాం. రోగనిరోధక శక్తి తగ్గడం వల్లనే చనిపోతారు కానీ నేరుగా కేన్సర్ వల్ల సమస్య ఉండదు.

  • ప్రస్తుతం అవార్డుకు నామినేట్ అయ్యారు. జాతీయ స్థాయి అవార్డు సాధించడంపై మీకున్న అంచనా ఏంటి.. ?

ప్రస్తుతం మా నార్త్ వెస్ట్ రీజియన్ నుంచి నన్ను నామినేట్ చేశారు. అలా ఏడు ప్రాంతాల నుంచి ఏడుగురుని ఎంపిక చేశారు. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుల బృందం, వైద్య నిపుణులు, ఇంతకు ముందు ఈ అవార్డు గెలుచుకున్న వారు.. అందరూ కలిసి ఒక వ్యక్తిని ఎంపిక చేస్తారు.

ఇదీ చదవండి

తెలుగు వైద్యుడికి బ్రిటన్​ ఉన్నత పురస్కారం

Last Updated : Nov 25, 2020, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.