అటవీశాఖలో కంపా నిధుల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్ వేయకుంటే అధికారులు కోర్టుకు రావాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. కేంద్ర ఇచ్చిన కంపా నిధులు సక్రమంగా వినియోగించలేదని పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త తోట సురేశ్బాబు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం అటవీశాఖకు ఇచ్చిన నిధులను ఎలా వాడారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండీ...