ETV Bharat / city

పోలవరం ఖర్చు: కేవీపీ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ

author img

By

Published : Feb 25, 2020, 10:06 PM IST

పోలవరం ఖర్చు కేంద్రమే భరించాలని కేవీపీ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని గతంలోనే కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.

Hearings in High court On KVP pil
పోలవరం ఖర్చు: కేవీపీ వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ

పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ... ఇప్పటికే కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉండగా హైకోర్టులో వాదనలు ఎలా జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను వేసిన పిటిషన్​కు సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉన్న పిటిషన్​కు వ్యత్యాసం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రాన్ని సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ... ఇప్పటికే కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉండగా హైకోర్టులో వాదనలు ఎలా జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను వేసిన పిటిషన్​కు సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉన్న పిటిషన్​కు వ్యత్యాసం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. పూర్తి వివరాలతో అదనపు ప్రమాణపత్రాన్ని సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

'కార్యకర్తలు చెప్పినవారినే వాలంటీర్లుగా నియమించాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.